మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా “మెర్సీ కిల్లింగ్” సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబి హారిక ప్రధాన పాత్రల్లో సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించిన ఈ సినిమాను శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పించారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రాఫి అందించగా ఎం.ఎల్.రాజా సంగీతం సమకూర్చారు. గత ఏడాది ఏప్రిల్ 9న థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాధించి ప్రస్తుతం ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత శ్రీమతి వేదుల బాల కామేశ్వరి మాట్లాడుతూ…భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుంది. గత ఏడాది ఏప్రిల్ 12న థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాధించింది. మా సినిమాలో నటించిన బేబి హరికకు గద్దర్ అవార్డ్ రావడం సంతోషంగా ఉంది, సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ లో మొదటి సినిమాకే ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ రావడంతో మా డైరెక్టర్ సూరపల్లి వెంకటరమణ కు ఆలాగే యూనిట్ సభ్యులకు అభినందనలు, మా బ్యానర్ లో మరిన్ని ఆలోచింపజేసే సినిమాలు రాబోతున్నాయని తెలిపారు.బేబి హారిక మాట్లాడుతూ…ఎమోషనల్ కథ కథనాలను సమాజంలో జరిగే కొన్ని సంఘటనలను తీసుకొని డైరెక్టర్ సూరపల్లి వెంకటరమణ గారు మెర్సీ కిల్లింగ్ సినిమాను తీశారు, నన్ను నమ్మి ఈ సినిమాలో నాకు ప్రధాన పాత్ర ఇచ్చిన డైరెక్టర్ సూరపల్లి వెంకటరమణ గారికి కృతజ్ఞతలు, నాకు నటనలో ఎన్నో మెలుకవలు నేర్పించడమే కాకుండా తనకు కావాల్సిన కంటెంట్ ను నా దగ్గరనుండి రాబట్టుకున్నారు, ఈ గుర్తింపు రావడానికి నాకు దోహదపడ్డారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత బాల కామేశ్వరి గారికి కృతజ్ఞతలు, నాకు అవార్డ్ ప్రదానం చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

డైరెక్టర్ సూరపల్లి వెంకటరమణ మాట్లాడుతూ…కథను నమ్మి చేసిన సినిమా మెర్సీ కిల్లింగ్. విమర్శకుల ప్రసంశలు పొందిన మా చిత్రానికి గద్దర్ అవార్డ్ రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ కు కృతజ్ఞతలు, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన నిర్మాత శ్రీమతి వేదుల బాల కామేశ్వరి గారికి, డాక్టర్ విజయ్ కుమార్ గారికి, సిద్ధార్ద్ హరియల గారికి మాధవి తాలబత్తుల గారికి ప్రేత్యేక కృతజ్ఞతలు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు నా దర్శకత్వంలో రాబోతున్నాయి అన్నారు.

Related Posts

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

మన న్యూస్ : బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 5 views
రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

  • By RAHEEM
  • October 29, 2025
  • 5 views
ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..