తిరుమలను అపవిత్రం చేసేందుకు వైసిపి కుట్ర చేస్తోంది..నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ

మన న్యూస్,తిరుపతి :- తిరుమల తిరుపతి దేవస్థానం ను వైసిపి నాయకులు అపవిత్రం చేసేందుకు లేనిపోని కుట్రలు చేస్తోందని తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత భక్తులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు 24 గంటల పాటు తిరుమలలో ఉండి భక్తులకు సేవ చేస్తున్నారన్నారు. అలాంటి వ్యక్తిపై వైసీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. వైసీపీని రాష్ట్రంలోని ప్రజలంతా చీ కొట్టిన వారికి ఇంకా బుద్ధి రాలేదని, ఏదో ఒక విధంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కుట్రలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో తిరుమలలో ఉన్న ఆక్రమణలను టిటిడి పాలకవర్గం బిఆర్ నాయుడు నాయకత్వంలో ప్రక్షాళన చేపట్టారని, వాటన్నింటినీ జర్నించుకోలేక ఏదో ఒకటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. గతంలో వైసిపి నాయకులు ఎవరైనా తిరుమల అభివృద్ధి గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. టీటీడీ పాలకవర్గంతో పాటు ఈవో అదనపు ఈవో తిరుమల కు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు శ్రీవారి దర్శనాన్ని సులభతరముగా చేసుకునేలా ఏర్పాట్లు చేశారన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ లుగా ఉన్న వారు ఎవరైనా తలనీలాలు సమర్పించారు అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి తలనీలాలు సమర్పిస్తే ఆ కార్యక్రమం పై కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు లేనిపోని విమర్శలు చేశారని తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు పాలకవర్గం అధికారులు చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించాల్సింది పోయి లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆర్ సి మునికృష్ణ ప్రశ్నించారు. ఇప్పటికైనా తిరుమల పై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని వైసీపీ నేతలకు కార్యకర్తలకు హితవు పలికారు. ఈ సమావేశంలో రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర, టిడిపి తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు, విశ్వనాథం, గంజి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Related Posts

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్…

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు