మన న్యూస్ సాలూరు ఏప్రిల్21: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో దూళిభద్ర కి చెందిన ముగ్గురు గిరిజనలను ఒరిస్సా పోలీసులు తీసుకొని వెళ్లడం పై మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన గిరిజనులు. ఆంధ్ర చేపడుతున్న పనులు ఒరిస్సా ప్రభుత్వం అడ్డుకోవడంపై గిరిజనల ఆవేదన. అన్యాయంగా మమ్మల్ని ఒరిస్సా ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక వారిచ్చిన సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదంటున్న కోటియా ప్రజలు.
ఒరిస్సా కి చెందిన రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, పెన్షన్ పుస్తకాలు మన్యం కలెక్టర్ కి అప్పగిస్తామంటున్న ఆరు గ్రామాల గిరిజనులు. మాకు ఒరిస్సా ప్రభుత్వ పధకాలు వద్దు. బ్రతికిన, చచ్చినా ఆంధ్రా ప్రభుత్వం లొ ఉంటామని వెల్లడి తన గోడును మాజీ ఉప ముఖ్యమంత్రి పీడి కి రాజన్నదొర కి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు ,తుండ సర్పంచ్ మువ్వల ఆదయ్య, సర్పంచ్ బిరుసు , నెమలిపిట్ట కల్యాణ్,ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో గల ఆరుగురు సర్పంచ్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *