ఇక చాలు ఆపండి..! రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

MANA NEWS :- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నెలలో ఆయన యూఎస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలాఉంటే.. తాను అధికారంలోకి వస్తే.. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపుతానని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో పలుసార్లు ప్రస్తావించారు. అయితే, ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఏ విధంగా ఆపుతారనే విషయాన్ని ట్రంప్ చెప్పలేదు. తాజాగా.. అధ్యక్ష ఎన్నికల్లో విజయం తరువాత ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఫోన్ చేశారు. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువరించింది.గురువారం ప్లోరిడాలోని తన ఎస్టేట్ నుంచి వ్లాదిమిర్ పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా యుక్రెయిన్ – రష్యా మధ్య వార్ గురించి పుతిన్ తో ట్రంప్ చర్చించారు. యుక్రెన్ యుద్ధాన్ని విస్తరించొద్దని సూచించినట్లు తెలిసింది. ఐరాపోలో అమెరికా మోహరించిన సైనిక సంపత్తి స్థాయిని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తుచేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. యుక్రెన్ యుద్ధం పై పరస్పరం చర్చించి ఓ పరిష్కారాన్ని కనుగొందామని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ట్రంప్ సూచించినట్లు తెలిసింది. ఇదే క్రమంలో పుతిన్ కు ట్రంప్ వార్నింగ్ సైతం ఇచ్చాడని తెలుస్తోంది.ఇదిలాఉంటే.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ నకు ఇటీవల పుతిన్ అభినందనలు తెలిపారు. ట్రంప్ తో చర్చలు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అయితే.. ఈ ఏడాది జూన్ 14న పుతిన్ మాట్లాడుతూ.. యుక్రెయిన్ పై యుద్ధాన్ని నిలిపివేయాలంటే పలు నిబంధనలు విధించాడు. అందులో ప్రధానమైనవి.. యుక్రెయిన్ NATO లో చేరకూడదు. రష్యా క్లెయిమ్ చేసిన నాలుగు ప్రాంతాల భూభాగం నుంచి యుక్రెయిన్ దళాలన్నింటిని ఉపసంహరించుకోవాలని సూచించారు. అయితే, యుక్రెయిన్ దానిని తిరస్కరించింది. అలా చేస్తే మేము రష్యా ముందు లొంగిపోవడంతో సమానమని పేర్కొన్న విషయం తెలిసిందే.

  • Related Posts

    ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

    మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెల్లగా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వై.ఆర్.సి కోటర్స్ వద్ద…

    ఎండియు వాహనాలు కొనసాగించాలని డ్రైవర్ల ఆందోళన

    గొల్లప్రోలు మే 24 మన న్యూస్ :– రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీకి వినియోగించే ఎండియు వాహనాలను తొలగించడంపై డ్రైవర్లు గురువారం గొల్లప్రోలు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.ఎండియు వాహనాలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై గొల్లప్రోలు పట్టణ,మండల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?