ఇక చాలు ఆపండి..! రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

MANA NEWS :- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నెలలో ఆయన యూఎస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలాఉంటే.. తాను అధికారంలోకి వస్తే.. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపుతానని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో పలుసార్లు ప్రస్తావించారు. అయితే, ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఏ విధంగా ఆపుతారనే విషయాన్ని ట్రంప్ చెప్పలేదు. తాజాగా.. అధ్యక్ష ఎన్నికల్లో విజయం తరువాత ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఫోన్ చేశారు. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువరించింది.గురువారం ప్లోరిడాలోని తన ఎస్టేట్ నుంచి వ్లాదిమిర్ పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా యుక్రెయిన్ – రష్యా మధ్య వార్ గురించి పుతిన్ తో ట్రంప్ చర్చించారు. యుక్రెన్ యుద్ధాన్ని విస్తరించొద్దని సూచించినట్లు తెలిసింది. ఐరాపోలో అమెరికా మోహరించిన సైనిక సంపత్తి స్థాయిని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తుచేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. యుక్రెన్ యుద్ధం పై పరస్పరం చర్చించి ఓ పరిష్కారాన్ని కనుగొందామని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ట్రంప్ సూచించినట్లు తెలిసింది. ఇదే క్రమంలో పుతిన్ కు ట్రంప్ వార్నింగ్ సైతం ఇచ్చాడని తెలుస్తోంది.ఇదిలాఉంటే.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ నకు ఇటీవల పుతిన్ అభినందనలు తెలిపారు. ట్రంప్ తో చర్చలు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అయితే.. ఈ ఏడాది జూన్ 14న పుతిన్ మాట్లాడుతూ.. యుక్రెయిన్ పై యుద్ధాన్ని నిలిపివేయాలంటే పలు నిబంధనలు విధించాడు. అందులో ప్రధానమైనవి.. యుక్రెయిన్ NATO లో చేరకూడదు. రష్యా క్లెయిమ్ చేసిన నాలుగు ప్రాంతాల భూభాగం నుంచి యుక్రెయిన్ దళాలన్నింటిని ఉపసంహరించుకోవాలని సూచించారు. అయితే, యుక్రెయిన్ దానిని తిరస్కరించింది. అలా చేస్తే మేము రష్యా ముందు లొంగిపోవడంతో సమానమని పేర్కొన్న విషయం తెలిసిందే.

  • Related Posts

    చైనాకు చెక్: ఆ దేశానికి BrahMos క్షిపణులను ఎగుమతి చేసిన భారత్..!

    Mana News ;- BrahMos Missile:రక్షణ ఎగుమతుల రంగంలో భారత్ మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది.మన అమ్ములపొదిలోని అత్యంత పవర్‌ఫుల్ వెపన్,సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించిన రెండవ బ్యాటరీ ఫిలిప్పీన్స్‌కు దిగుమతి చేసింది. ఏప్రిల్ 2024లో భారత వాయుసేన విమానం…

    ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌ను నోరు మెదపకుండా చేసిన భారత్..!

    Mana News :- పాకిస్తాన్‌ను మరోసారి ఐక్యరాజ్యసమితిలో నోరు మెదపకుండా చేసింది భారతదేశం. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే లేవనెత్తడం వల్ల ప్రపంచం ముందు అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అయినప్పటికీ తన కార్యకలాపాలను ఆపాడంలేదు. జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతూనే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.

    ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.

    పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

    • By APUROOP
    • April 24, 2025
    • 3 views
    పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

    కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

    • By APUROOP
    • April 24, 2025
    • 4 views
    కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

    పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

    • By APUROOP
    • April 24, 2025
    • 4 views
    పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

    ఉగ్రవాద దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

    • By APUROOP
    • April 24, 2025
    • 3 views
    ఉగ్రవాద దాడులను నిరసిస్తూ  కొవ్వొత్తుల ర్యాలీ

    శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..

    • By APUROOP
    • April 24, 2025
    • 3 views
    శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..