మన ధ్యాస, నెల్లూరు, జనవరి 14 : నెల్లూరు జిల్లాలో పవిత్రమైన పెన్నానది తీరంలో ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే గొబ్బెమ్మల పండుగ ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగురు నారాయణ బుధవారం అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పండుగ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన భద్రత, వసతి ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ…. గొబ్బెమ్మల పండుగకు సుమారు 15 వేల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు..కార్పొరేషన్, పోలీస్, ఫైర్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, టూరిజం మరియు దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారుభక్తుల భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి స్పష్టం చేశారు. నీటి అంచున పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గొబ్బెమ్మల పండుగ నిర్వహించే ఏటి ప్రాంతంలో స్వయంగా మనిషిని దింపి నీటి లోతును పరిశీలించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.రద్దీకి అనుగుణంగా తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ వంటి అన్ని మౌలిక వసతులను కల్పించాలని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.పెన్నా నది వడ్డున ప్రతీ ఏటా గొబ్బెమ్మ పండుగ నిర్వహించడం మన ఆనవాయితీ అని ఈ పండుగకు 15 వేల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు, జాగ్రత్తలు, భద్రతపై అధికారులతో సమీక్ష నిర్వహించాం. ఏటిలో నీటిపాయ ఉన్నందున ఈసారి ఒకపక్కే గొబ్బెమ్మల పండుగకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతాము,” అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు నారాయణ విద్యాసంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఆర్డీవో అనూష, డిఎస్పి శ్రీనివాసులు రెడ్డి,52వ డివిజన్ కార్పోరేటర్ అస్మా మైనుద్దీన్ ..స్థానిక టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *