గిరిసీమల్లో సుపరిపాలన తొలిఅడుగు – మండల టీడీపీ అధ్యక్షులు యుగంధర్

మన న్యూస్ పాచిపెంట,జూలై 25 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కూటమి ప్రభుత్వమైన తెలుగుదేశం జనసేన పార్టీల తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని పాచిపెంట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు యుగంధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు ఆయన సారధ్యంలో గిరిశిఖర గిరిజన గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం నిర్వహించారు.గొట్టూరు, మూటకూడు, బొర్రమామిడి పంచాయితీ గ్రామాల్లో ఏడాది పాలనలో ప్రభుత్వం అందించిన సంక్షేమం అభివృద్ధి పై ప్రజలకు తెలియజేశారు. సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖీ సూర్యనారాయణ ప్రభుత్వ పథకాలు గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదని ప్రశ్నించారు. ఇంటింటికి తిరిగి గిరిజన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాలనలో గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం జరిగాయని, మిగతా రహదారుల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేస్తామని మీ సమస్యలు ఉంటే చెప్పండి పరిష్కరానికి కృషి చేస్తామని తెలిపారు. శుక్రవారం నాడు గిరిజన ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు గిరిజన ప్రజలు ఘన స్వాగతం పలికారు. మంచినీటి సౌకర్యం కోసం వినతలు అందించారు. మరికొన్ని రహదారులు కావాలని దరఖాస్తులు చేసుకున్నారు. పై కార్యక్రమానికి మండల పార్టీ ఉపాధ్యక్షులు కొత్తల పోలి నాయుడు, పాచిపెంట ఎంపీటీసీ ఉమామహేశ్వరరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూసర్ల నర్సింగరావు, మాదిరెడ్డి మజ్జా రావు, దండి మోహనరావు, కేసలి శ్రీనివాసరావు పలువురు నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు హాజరయ్యారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…