కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ ఆదేశాలతో పురుగులు మందు కంపెనీ పై దర్యాప్తు ముమ్మరం

మన న్యూస్ పార్వతీపురం జులై 5:- పార్వతిపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఇప్పటికైనా పురుగులు మందు ఫ్యాక్టరీ పై ఉన్న అభియోగాలు పైన పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి పంచాయితీ ప్రజలకు నిజ నిజాలు తెలియజేసి పంచాయతీ ప్రజలకు భరోసా కల్పించాలి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరపున అధికారులకి విన్నవించుకున్నాము, ఈ సందర్భంగా గంగరేగివలస ఎంపీటీసీ గంట వెంకట్ నాయుడు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి రైతులు అందరితో కలిసి పత్రిక విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగ రేగివలస పంచాయతీ పరిధిలో ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన పురుగుల మందు ఫ్యాక్టరీ ప్రారంభించిన కన్నా ఇప్పుడు ఎక్కువ దిగుమతి చేస్తున్నారని అలాగే కలుషితమైన విష వాయు వ్యర్ధపదార్థాలు చెరువులో వదిలేస్తున్నారని దీనివల్ల పొలాల్లో బోర్ లో ఉన్న నీరు కలుషితం అవుతుందని అలాగే విపరీతమైన దుర్వాసన వస్తుందని దీనివల్ల ఇప్పటికీ గంగిరేయవలసలో పంచాయతీ పరిధిలో గంగిరేగివలస సోమినాయుడు వలస గ్రామంలో 12 మంది వరకు వివిధ రకాల క్యాన్సర్ వ్యాధితో చనిపోవడంతో పాటు ఇంకా కొంతమంది వివిధ రకాల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని ఇంత జరుగుతుంటే వైద్య శాఖ అధికారులు మాత్రం ముగ్గురు కు మాత్రమే క్యాన్సర్ వ్యాధి వలనచనిపోయారని చెప్పడం చాలా విడ్డూరం ఉందని కాబట్టి ఇలాంటి సందర్భంలో పురుగులు మందుపై వస్తున్న విభిన్న అభియోగాలపైన వెంటనే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి నిజ నిజాలు తేల్చాలని కోరుతూ కలెక్టర్ కి గ్రీవెన్స్ లోను పురుగుల మందు ఫ్యాక్టరీ పై సిపిఎం పార్టీ ఇతర ప్రజా సంఘాలు మరియు గంగ రేగివలస రైతులు కలిసి పత్రికా ప్రకటనతో పాటు జేడీ కి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదులు ఇచ్చిన మేరకుఈరోజు అనగా శనివారం కలెక్టర్ స్పందించి వారి యొక్క ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ తాసిల్దార్ సిహెచ్ సత్యనారాయణ వైద్యశాఖ అధికారి డిఎంహెచ్ఓ పద్మావతి పోలీస్ సిబ్బంది రైటర్ నాగరాజు నీటిపారుదల శాఖ జేఈ అభిషేక్ అలాగే పొల్యూషన్ అధికారి ఫ్యాక్టరీ వద్దకు వచ్చి అన్ని విధాలుగా పరిశీలించడం జరిగిందని అయితే పైన తెలిపిన అన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయిలో ఈ ఫ్యాక్టరీ కి సంబంధించిన అన్ని రకాల అనుమతులు పరిశీలించిన తర్వాత వాటి యొక్క నివేదిక రైతుల యొక్క అభిప్రాయాన్ని సేకరించి ఈ నివేదికలన్నీ వారం రోజుల్లో జిల్లా కలెక్టర్ కి పంపిస్తామని కొమరాడ తాసిల్దార్ రైతులకు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా గంగ రేగివలస గ్రామ సమీపంలో ఉన్న పురుగులు మందు కంపెనీపై వస్తున్న అన్ని విధాల ఆరోపణలపై పూర్తిస్థాయిలో పుల్ స్టాప్ పడే విధంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఇకనైనా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి సంబంధించిన నివేదికలన్నీ గ్రామ సభల ద్వారా పంచాయతీ ప్రజలకు తెలియజేయాలని అలాగే చెడ్డకు, అడ్డంగా గొయ్యి ఇరిగేసిన అధికారులు తవ్వేయడం చాలా అన్యాయమని ఈ విషయాన్ని తాసిల్దార్ సిహెచ్ సత్యనారాయణ దృష్టికి రైతులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తీసుకెళ్లగా వెంటనే తాసిల్దార్ ఇరిగేషన్ జేఈ తో మాట్లాడి ఈ గొయ్య కప్పేయాలని ఎందుకంటే ఈ వర్షాకాలంలో రైతులకు అవసరం కాబట్టి ఈ గొయ్యి కప్పేయాలని ఇరిగేషన్ జేఈ కి తాసిల్దార్ చెప్పడం జరిగింది, కాబట్టి ఇలాంటి సందర్భంలో రైతులు చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పూర్తిగా మద్దతు ఉంటుందని అలాగే ఇప్పటికే క్యాన్సర్ వ్యాధితో చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసి ఇవ్వాలని అలాగే సోమినాయుడు వలస గంగ రేగువలస గ్రామంలో క్యాన్సర్ తో బాధపడుతున్న వారి కుటుంబాలకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని ఈ సందర్భంగా అటు జిల్లా కలెక్టర్ కి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో రైతులు మరిచర్ల సింహాసలం మరిచర్ల సత్యనారాయణ గంగ రేగువలస గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..