తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాఠశాలను ఆపండి.. సి.ఐ.టి.యు

గూడూరు, మన న్యూస్ :- తల్లిదండ్రులు తమ పిల్లల మీదున్న శ్రద్ధతో మా ఊరు బడి మాకు కావాలి – బయట గ్రామాలకి మా పిల్లలను పంపించలేం అంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేయడంపై శుక్రవారం రోజు తిరుపతి జిల్లా గూడూరు మండలంలోని యం.ఇ.ఓ. డి. రవీంద్రబాబును స్థానిక సి.ఐ.టి.యు నాయకులు కలిసి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామాలలోనికి వెళ్లి పాఠశాలలకు తమ పిల్లలను పంపమని వారి తల్లిదండ్రులను కలిసి విద్యార్థులకు చదువులు ఆపవద్దు, దయచేసి చదివించండి, పాఠశాలకు పంపించండి, అని వారికి తెలియజేయడం జరుగుతూ ఉందని, తల్లిదండ్రులు జూలై 10 వరకు గడువు కోరడం జరిగిందని, ఆయన తెలియజేశారు. ఆయా పాఠశాలలకు ఒక కిలోమీటరు పైబడి దూరం ఉన్న విద్యార్థులను గుర్తించి సమాచారం ఇవ్వమని ఉపాధ్యాయులకు తెలియజేయడం జరిగిందని, విద్యార్థుల రవాణా ఖర్చులకు గాను ప్రతి విద్యార్థికి నెలకు రూ.1000/-(వెయ్యి రూపాయలు) లెక్కన వారికి సంబంధించిన తల్లికి వందనం అకౌంట్లలో జూన్,జూలై,ఆగస్టు నెలలకు సంబంధించి రూ.3000/- రూపాయలు వేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవహరించిన బాటలోనే కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ తమ పిల్లలను చదువుకు దూరం చేయడంతో దూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ఎటువంటి రవాణా సౌకర్యం లేకపోవడం తల్లిదండ్రులు చదువుకు స్వస్తి పలికి ఇంటి దగ్గరే పిల్లలను ఉంచుకోవడం జరుగుతూ ఉంది. ఇకనైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు, నాయకులు కలగచేసుకొని ఆయా పాఠశాలలు పక్కనే అదనపు గదులు ఏర్పాటు చేసి తరగతులకు సంబంధించిన ఉపాధ్యాయులను నియమించి చదువులు కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గూడూరు డివిజన్ ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్, గూడూరు పట్టణ సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి బి.వి. రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..