తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాఠశాలను ఆపండి.. సి.ఐ.టి.యు

గూడూరు, మన న్యూస్ :- తల్లిదండ్రులు తమ పిల్లల మీదున్న శ్రద్ధతో మా ఊరు బడి మాకు కావాలి – బయట గ్రామాలకి మా పిల్లలను పంపించలేం అంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేయడంపై శుక్రవారం రోజు తిరుపతి జిల్లా గూడూరు మండలంలోని యం.ఇ.ఓ. డి. రవీంద్రబాబును స్థానిక సి.ఐ.టి.యు నాయకులు కలిసి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామాలలోనికి వెళ్లి పాఠశాలలకు తమ పిల్లలను పంపమని వారి తల్లిదండ్రులను కలిసి విద్యార్థులకు చదువులు ఆపవద్దు, దయచేసి చదివించండి, పాఠశాలకు పంపించండి, అని వారికి తెలియజేయడం జరుగుతూ ఉందని, తల్లిదండ్రులు జూలై 10 వరకు గడువు కోరడం జరిగిందని, ఆయన తెలియజేశారు. ఆయా పాఠశాలలకు ఒక కిలోమీటరు పైబడి దూరం ఉన్న విద్యార్థులను గుర్తించి సమాచారం ఇవ్వమని ఉపాధ్యాయులకు తెలియజేయడం జరిగిందని, విద్యార్థుల రవాణా ఖర్చులకు గాను ప్రతి విద్యార్థికి నెలకు రూ.1000/-(వెయ్యి రూపాయలు) లెక్కన వారికి సంబంధించిన తల్లికి వందనం అకౌంట్లలో జూన్,జూలై,ఆగస్టు నెలలకు సంబంధించి రూ.3000/- రూపాయలు వేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవహరించిన బాటలోనే కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ తమ పిల్లలను చదువుకు దూరం చేయడంతో దూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ఎటువంటి రవాణా సౌకర్యం లేకపోవడం తల్లిదండ్రులు చదువుకు స్వస్తి పలికి ఇంటి దగ్గరే పిల్లలను ఉంచుకోవడం జరుగుతూ ఉంది. ఇకనైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు, నాయకులు కలగచేసుకొని ఆయా పాఠశాలలు పక్కనే అదనపు గదులు ఏర్పాటు చేసి తరగతులకు సంబంధించిన ఉపాధ్యాయులను నియమించి చదువులు కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గూడూరు డివిజన్ ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్, గూడూరు పట్టణ సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి బి.వి. రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

మన న్యూస్ సాలూరు జూలై 6:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నందు, స్థానిక ఆర్యవైశ్య ధర్మశాల లో ఈరోజు ఆదివారం రాష్ట్రస్థాయి 16 సంవత్సరాల లోపు బాల…

అనంతపురంలో బీజేపీకి బలమేర్పడుతోంది: భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర బీజేపీలో చేరారు

అనంతపురం, జులై 6 (మన న్యూస్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ అభివృద్ధికి సాకారమవుతున్న కృషిని, ప్రజల సేవా ఉద్యమాన్ని ప్రశంసిస్తూ భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. జిల్లా బీజేపీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

అనంతపురంలో బీజేపీకి బలమేర్పడుతోంది: భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర బీజేపీలో చేరారు

అనంతపురంలో బీజేపీకి బలమేర్పడుతోంది: భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర బీజేపీలో చేరారు

యువకవి అంజనాద్రికి మాజీ మంత్రి రోజా అభినందనలు

యువకవి అంజనాద్రికి మాజీ మంత్రి రోజా అభినందనలు

శ్రీశైలం నీటి విడుదల, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆందోళనరాయలసీమ ప్రతినిధులను ‘కళ్ళులేని కబోదులు’గా న్యాయవాది కృష్ణమూర్తి ఆరోపణ

శ్రీశైలం నీటి విడుదల, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆందోళనరాయలసీమ ప్రతినిధులను ‘కళ్ళులేని కబోదులు’గా న్యాయవాది కృష్ణమూర్తి ఆరోపణ

ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు జన్మదిన వేడుకలు

పీర్లకు వెండి గుర్రం, శంకు-చక్రాలను అందించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

పీర్లకు వెండి గుర్రం, శంకు-చక్రాలను అందించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి