నాటి ప్రభుత్వాలు… నేటి ప్రభుత్వాలు దోచుకోవడమేప్రభుత్వాలకు నడిగడ్డ మీద ప్రేమలేదు.జూరాల డ్యాం రిపేర్ చేయకుంటే భవిష్యత్త్ కష్టమే- మాజీ శాసన సభ్యులు డికె. భరత సింహారెడ్డి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని డికె. బంగ్లా లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు డీకే భరత సింహారెడ్డి మాట్లాడుతూ. జూరాల ప్రాజెక్టు సేఫ్ గా ఉందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చెప్పిన మాటలు అబద్ధమని అన్నారు. డ్యామ్ నిర్మాణ సమయంలో సొరంగం ఉందని దానిలోకి బురద వెళ్లిందంటే డ్యామ్ ఎప్పుడు తేమ శాతంతో ఉండి ఎప్పుడైన ప్రమాదంకు గురికావచ్చని సారంగంలోకి వెళ్లడానికి రెండు లిఫ్ట్లు ఉన్నాయని అవి మూసుకుపోయి 8ఏళ్ళు అయ్యిందని అన్నారు. ఏ ఒక్క అధికారి కూడ అందులోకి పోయి లోన సిల్ట్ తోపాటు ఏమైన పేరుకు పోయిందా అని చూసేనాథుడే లేడన్నారు. ప్రాజెక్టులో సిల్ట్ పేరుకుపోయిందని దాని వాలన డ్యామ్ పునాదిపై వత్తిడి పెరిగిపోతున్నదని , ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితి గురించి తెలియని మంత్రి ప్రాజెక్టు సేఫ్ గా ఉందని చెప్పడం మంత్రికి మంచిది కాదని అన్నారు. లోన ఉన్న ఎనిమిది మీటర్లలో పేరుకుపోయిన సిల్డ్ తీయని ప్రభుత్వం ప్రాజెక్టులో పేరుకుపోయిన సిల్ట్ తీస్తామని అంటున్నారని అన్నారు. క్రస్ట్ గేటు తెగిపోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పనులు చేసేవారికి బిల్లులు చేయకపోతే కాంట్రాక్టర్లు పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
ర్యాలంపాడు కాలువలు ఇప్పటి వరకు పూర్తికాలేదని ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలకు నాలుగుళ్ళు అయిన ఆడిగేనాథుడే లేడన్నారు. గద్వాలలో పెత్తందారి వ్యవస్థ నడుస్తుందని దీని వలన ఉన్నోడి చేతిలోకి డబ్బు పోతున్నదని ,సీడ్ వ్యవస్థ మొత్తం నాశనం అయ్యిందని, కొన్నేళ్లలో ఇక్కడ సీడ్ వ్యవస్థ ఉండదని వివరించారు. గద్వాల అభివృద్ధి పూర్తిగా వెనకబడి పోయిందని ఆయన వివరించారు..

  • Related Posts

    ఘనంగా నరేష్ గుప్తా జన్మదిన వేడుకలు

    కర్మన్ ఘాట్, మన న్యూస్ :- కర్మన్ ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త ఓరుగంటి నరేష్ గుప్తా జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంపాపేట్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నరేష్ గుప్తాను…

    అబద్దాలతో మసిబూసి మారేడు కాయ చేయాలని చూస్తున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ రిపేర్ల పై ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెబుతారు. సిట్టింగ్ హైకోర్టు చర్చిచే ఎంక్వయిరీ చేయించాలి.

    గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డీకే భరత సింహారెడ్డి. జూరాల ప్రాజెక్టు, ర్యాలంపాడు రిజర్వాయర్ ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి. ర్యాలంపాడు రిజర్వాయర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా నరేష్ గుప్తా జన్మదిన వేడుకలు

    ఘనంగా నరేష్ గుప్తా జన్మదిన వేడుకలు

    దాడిశెట్టి రాజా ను కలిసిన ముద్రగడ…

    దాడిశెట్టి రాజా ను కలిసిన ముద్రగడ…

    కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ విప్ థామస్ జన్మదిన వేడుకలు

    కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ విప్ థామస్ జన్మదిన వేడుకలు

    అధికధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు – మండలవ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు హెచ్చరిక

    అధికధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు – మండలవ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు హెచ్చరిక

    నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఆది శంకరా కళాశాల

    నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఆది శంకరా కళాశాల

    భూ పోరాటాలు భూ సమస్యలు పై గూడూరు రిటైర్డ్ అధికారుల భవనం ఈ నెల 30న జిల్లా సదస్సు విజయవంతం చేయండి – ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ అధ్యక్షులు డి పి పోలయ్య

    భూ పోరాటాలు భూ సమస్యలు పై గూడూరు రిటైర్డ్ అధికారుల భవనం ఈ నెల 30న జిల్లా సదస్సు విజయవంతం చేయండి – ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ అధ్యక్షులు డి పి పోలయ్య