గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని డికె. బంగ్లా లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు డీకే భరత సింహారెడ్డి మాట్లాడుతూ. జూరాల ప్రాజెక్టు సేఫ్ గా ఉందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చెప్పిన మాటలు అబద్ధమని అన్నారు. డ్యామ్ నిర్మాణ సమయంలో సొరంగం ఉందని దానిలోకి బురద వెళ్లిందంటే డ్యామ్ ఎప్పుడు తేమ శాతంతో ఉండి ఎప్పుడైన ప్రమాదంకు గురికావచ్చని సారంగంలోకి వెళ్లడానికి రెండు లిఫ్ట్లు ఉన్నాయని అవి మూసుకుపోయి 8ఏళ్ళు అయ్యిందని అన్నారు. ఏ ఒక్క అధికారి కూడ అందులోకి పోయి లోన సిల్ట్ తోపాటు ఏమైన పేరుకు పోయిందా అని చూసేనాథుడే లేడన్నారు. ప్రాజెక్టులో సిల్ట్ పేరుకుపోయిందని దాని వాలన డ్యామ్ పునాదిపై వత్తిడి పెరిగిపోతున్నదని , ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితి గురించి తెలియని మంత్రి ప్రాజెక్టు సేఫ్ గా ఉందని చెప్పడం మంత్రికి మంచిది కాదని అన్నారు. లోన ఉన్న ఎనిమిది మీటర్లలో పేరుకుపోయిన సిల్డ్ తీయని ప్రభుత్వం ప్రాజెక్టులో పేరుకుపోయిన సిల్ట్ తీస్తామని అంటున్నారని అన్నారు. క్రస్ట్ గేటు తెగిపోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పనులు చేసేవారికి బిల్లులు చేయకపోతే కాంట్రాక్టర్లు పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
ర్యాలంపాడు కాలువలు ఇప్పటి వరకు పూర్తికాలేదని ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలకు నాలుగుళ్ళు అయిన ఆడిగేనాథుడే లేడన్నారు. గద్వాలలో పెత్తందారి వ్యవస్థ నడుస్తుందని దీని వలన ఉన్నోడి చేతిలోకి డబ్బు పోతున్నదని ,సీడ్ వ్యవస్థ మొత్తం నాశనం అయ్యిందని, కొన్నేళ్లలో ఇక్కడ సీడ్ వ్యవస్థ ఉండదని వివరించారు. గద్వాల అభివృద్ధి పూర్తిగా వెనకబడి పోయిందని ఆయన వివరించారు..