

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 ;- జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని పోలీస్
అర్ధరాత్రి పోలీస్ విధులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్. రాత్రి వేళల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహించే పెట్రోలింగ్ , బ్లూ కోల్ట్స్, బీట్ డ్యూటీ లను జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ నిన్నా అర్ద రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో భాగంగా గద్వాల పట్టణం లోని వై.యస్.ఆర్ చౌక్, న్యూ బస్ స్టాండ్, కృష్ణ వేణి చౌక్ ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేసి పెట్రోలింగ్, బీట్, బ్లూ కోల్ట్స్ డ్యూటీలను పరిశీలించారు. ఈ సందర్భంగా విధులలో ఉన్న అధికారులతో, సిబ్బంది తో ఎస్పీ మాట్లాడుతూ అర్ద రాత్రి రోడ్లమీదకు వారిని తనిఖీలు చెయ్యాలని, అనుమానాస్పద వ్యక్తులను ప్రింగర్ ప్రింట్ ద్వారా పాపీలన్ డివైస్ లో చెక్ చెయ్యాలని అన్నారు. ప్రతి వాహనదారుడిని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు చెయ్యాలని, వాహనాలను తనిఖీ చెయ్యాలని ఆదేశించారు. లాడ్జీలలో తనిఖీలు చేపట్టి కొత్తగా ఉండే వారి వివరాలు పరిశీలించాలని , బీట్ సిబ్బంది కాలనీలలో విస్తృతంగా తిరగాలని, ప్రాపర్టీ నేరాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట డి. ఎస్పీ మొగిలయ్య, సి ఐ టంగుటూరీ శ్రీను, ట్రాఫిక్ ఎస్సై బాలచందర్ అన్నారు.
