

- ప్రైవేట్ పాఠశాలలను పట్టించుకోని విద్యాశాఖ అధికారులు..
- అడ్మిషన్ కొరకే వేల రూపాయలు వసూళ్లు…
శంఖవరం మన న్యూస్ (అపురూప్): ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అడ్డగోలు దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. స్కూల్లో ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నాయి. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం… చోద్యం చూస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటోంది.వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి లో నూతనంగా ప్రారంభించిన స్కూల్లో ఫీజులు అధికంగా ఉన్నాయని అన్నారు. శుక్రవారం సామాన్య విద్యార్థి తండ్రి వర్మ మన న్యూస్ ప్రతినిధితో చారవాణిలో మాట్లాడుతూ, యూకేజీ విద్యార్థిని స్కూల్లో చేర్చేందుకు అడ్మిషన్ ఫీజు రూ. 5000, స్కూల్ ఫీజు రూ. 29000 విద్యార్థి రవాణా బస్ కొరకు రూ. 8000, పుస్తకాలు రూ. 3800 చెల్లించాలని యాజమాన్యం తెలియజేసిందని అన్నారు. యూకేజీ లోనే చేర్చేందుకు సుమారు రూ. 45,000 చెల్లించాల్సి వస్తుందని, అన్నిటి ధరలు చుక్కలంటుతున్నాయని అన్నారు. తగు విషయాన్ని చారవాణి ద్వారా విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలియచేయాలని ప్రయత్నించిన అందుబాటులో లేరని అన్నారు.పాఠశాలలో పాఠ్యపుస్తకాలు మొదలుకొని బూట్లు వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు పలువురు నోట్ల వినిపిస్తున్నాయి. బయట మార్కెట్లతో పోలిస్తే పాఠశాలలో విక్రయించే వివిధ సామాగ్రి ధరలు అధికంగా ఉన్నాయని అభిప్రాయాలు ఉన్నాయి. పుస్తకాలతో సహా విద్యార్థి ధరించే యూనిఫామ్, స్నాక్స్, బూట్లు, బెల్టు పై తమ పాఠశాల పేరే ఉండాలని నిబంధన ఉండడంతో తల్లిదండ్రులు ధరలు ఎక్కువైన కొనక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబంలో ఇద్దరు పిల్లలకు వెళ్లే పిల్లలు ఉన్న చోట రూ. 15వేల నుంచి 20వేల వరకు కేవలం వస్తువుల కొనుగోలుకే వెచ్చించాల్సి వస్తుందని పలువురు పోషకులు వాపోతున్నారు. యాజమాన్యం వైఖరితో మధ్యతరగతి వర్గాల ప్రజలు పై తీవ్ర భారం పడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లం మధ్యమంలోనూ పూర్తి ఉచిత బోధన లభిస్తున్నప్పటికీ చదువులో నాణ్యత ఉండదనే భావనతో అత్యధికమంది అష్ట కష్టాలు పడి తమ పిల్లలను ప్రైవేటు స్కూల్లోనే చేర్పిస్తున్నట్లు తెలుస్తుంది. సామాన్యులకు భారంగా విద్యార్థుల తల్లిదండ్రులు అవసరాన్ని అవకాశంగా మలుచుకుంటున్న కొని పాఠశాలల యాజమాన్యాలు హిస్టారీతిన అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ఫీజులు నియంత్రణపై ప్రభుత్వ పరంగా ఎలాంటి అజమాయిషి లేకపోవడంతో యాజమాన్యాలు ఆడింది ఆటగా సాగుతుంది. ఆంగ్ల మధ్యమంలో యూకేజీ, అభ్యసించే విద్యార్థికి సంవత్సరానికి కనీసం రూ. 29 వేల నుంచి ఇతర తరగతులకు 50 వేలు వసూలు చేస్తున్నారు. అంతేకాక వేళ్ళలో అడ్మిషన్ ఫీజులు సైతం వసూలు చేస్తూ తల్లిదండ్రుల నడ్డి విరిస్తున్నారు. జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలపై దర్యాప్తు నిర్వహించి అధిక ఫీజులు బాదుడు లను తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.