

మన న్యూస్, విడవలూరు:- సీఎం చంద్రబాబు సారథ్యంలో అన్నదాతలకు లబ్ధి.- 24 గంటల్లోనే ధాన్యం అమ్మకాల నగదు జమ.- రైతుల తొలి పండుగ ఏరువాక పౌర్ణమి.నాగరికత ఎంత పెరిగినా.. నాగలి లేనిదే పని జరగదని, రైతు లేనిదే పూట గడవదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. విడవలూరు మండలం చౌకిచర్ల గ్రామంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ప్రశాంతమ్మకు నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ఎడ్ల బండిపై ఊరేగించుకుంటూ గ్రామానికి తీసుకువచ్చారు. అనంతరం వ్యవసాయ పనిముట్లకు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎడ్ల బండిపై ఎక్కి ఏరువాక ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ… వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఏరువాక పౌర్ణమి అని, డెల్టా ప్రాంతమైన కోవూరులో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఉందన్నారు. సాగునీరు రైతులకు సరిపడా ఉందని, ఈ ఏడు పంటలు బాగా పండాలని ఆమె ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, స్వర్ణాంధ్ర@2047 ద్వారా వ్యవసాయం, మత్స్యకార రంగం, రవాణా రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంట కాలువల్లో ఎక్కడికక్కడ పూడికలు తొలగించి రైతులకు మేలు చేశామన్నారు. ప్రభుత్వం ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే నగదు చెల్లించి రైతులను ఆదుకుందని చెప్పారు. రైతులకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా మంత్రుల దగ్గరి నుంచి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారని, ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంవత్సరం రైతులకు పంటలు బాగా పండాలని, అధిక దిగుబడులు రావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత బెజవాడ వంశీ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కొమ్మి మురళీ రెడ్డి, అలగర వినోద్కుమార్, అశోక్కుమార్రెడ్డి, శ్రీనివాసులు, సురేష్, ప్రభాకర్, విజయ్కుమార్, సుబ్బారెడ్డి, బీజేపీ నాయకులు రాఘవేంద్రరావు, కోటిరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.





