మెటల్ క్వారీ అనుమతుల కొరకు ప్రజల అభిప్రాయ సేకరణ…

  • కొత్త క్వారీలు వద్దంటూ గలమెత్తిన గ్రామాల ప్రజలు..
  • ఉన్న క్వారీలకు కూడా ప్రత్యేక రవణ మార్గాలు ఏర్పాటు చేయాలి…
  • సామాజిక కార్యకర్త మేకల కృష్ణ డిమాండ్..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) క్వారీలు వల్ల పల్లె గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని సామాజిక కార్యకర్త మేకల కృష్ణ గళమెత్తారు.కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్. పైడిపాల గ్రామంలో సర్వే నెంబరు 15 రోడ్డు మెటల్ క్వారీ అనుమతుల కోసం అధికార యంత్రాంగం నిర్వహించిన ప్రజా అభిప్రాయ సేకరణ సభలో స్థానికులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. సభకు హాజరైన స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు రైతులు తదితరులు కొత్తగా క్వారీకి అనుమతులు ఇవ్వద్దని బహిరంగంగా అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రాంత దీర్ఘ కాలం గా రౌతులపూడి శంఖవరం మండలాల పరిధిలోని ఎస్. పైడిపాల, గుమ్మరేగులు, బంగారయ్య పేట, శృంగవరం, మెరక చామవరం, శాంతి ఆశ్రమం జంక్షన్, నెల్లిపూడి, కత్తిపూడి వంటి గ్రామాలలో అనుమతులున్న క్వారీల నుండి తరలిస్తున్న నల్లరాయి, లేటరైట్, గ్రావెల్ టిప్పర్లు రహదారులను తీవ్రంగా దెబ్బతీసాయని సామాజిక కార్యకర్త మేకల కృష్ణ మరియు స్థానికులు ద్వజమెత్తారు. అత్యధిక బరువుతో నలబెట్టాల నుండి 60 టన్నుల వరకు నిత్యం సాగుతున్న రవాణా వల్ల పంచాయతీ రోడ్లు ధ్వంసం అవుతున్నాయని రోడ్లపై వేసిన హై స్పీడ్ వాహనాలు కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాక ఈ రవాణాలో పుట్టే దూళి ధ్వని వల్ల గ్రామంలోని ప్రజలు అనేక వ్యాధులకు గురవుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. కొత్తగా ఎటువంటి క్వారిలకు కూడా అనుమతులు ఇవ్వకుడదని, రోడ్లపై తిరుగుతున్న టిప్పర్లకు ప్రత్యేక రవాణా మార్గాలు ఏర్పాటు చేయాలని ఎస్ పైడిపాల జల్దాం రాఘవపట్నం ప్రాంతాల నుంచి నేరుగా కత్తిపూడి జాతీయ రహదారిని కలిపే ప్రత్యేక రోడ్డు నిర్మించాలని కోరారు. బాధిత గ్రామాల ప్రజలు అధికారుల ఎదుట తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరహాగా శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభకు పెద్దాపురం ఆర్డీవో రమణి తహసిల్దార్ ఎస్ వి నరేష్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి శంకరరావు తదితర అధికారులు హాజరయ్యారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 7 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…