

శేరిలింగంపల్లి(నవంబర్ 23)మన న్యూస్ :- మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో భగవాన్ శ్రీ సత్య సాయి మందిరంలో శ్రీ సత్య సాయి సేవా సమితి ట్రస్ట్ సభ్యులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 99 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ మహా నారాయణ సేవ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్,ఎమ్యెల్యే అరికపూడి గాంధీ,కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర్ ,ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.