మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం.. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 21)మన న్యూన్ :- శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ చెందిన  వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,సీనియర్ నాయకులు,కాలనీ వాసులు గురువారం  గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ని  కార్పొరేటర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తమ కాలనీలో ఎన్నాళ్లుగానో ఉన్న డ్రైనేజీకి అవుట్ లెట్  సమస్య చర్యలు తీసుకోవాలని  అసంపూర్తిగా మిగిలిపోయిన సి సి రోడ్డు,యూజీడీ పైప్ లైన్ నిర్మాణము పనులను పూర్తి చేయాలని,మంచి నీటి వసతిని ,మెరుగుపరచాలని విద్యుత్ సమస్యలను మరియు విధి దీపాలు సక్రమంగా పనిచేసేలా చూడలని,పారిశుధ్యం పనులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ని కోరగా.. తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు.కాలనీ వాసులకు ఇబ్బందులు లేకుండా డ్రైనేజీకి అవుట్ లెట్ ను ఏర్పాటుచేసి, అందుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతిపాదనలు సిద్ధం  కాగానే నిధులు మంజూరు చేయించి త్వరగా పూర్తి చేసి ప్రజల కష్టాలు తీరుస్తామని తెలిపారు.అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా దృశ్య భూగర్భ డ్రెయినేజీ పైప్ లైన్ డయా పెంచి లెవల్స్ తో అనుసంధానం చేస్తూ ఒక్క కాలనీ నుండి మరొక కాలనీ కి మధ్యన ఇబ్బందులు తల్లెత్తకుండ పనులు ప్రణాళిక బద్దంగా అన్ని కాలనీలకు దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని.దశల వారిగా చెప్పటి పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, డ్రైనేజి వ్యవస్థను,మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని కార్పొరేటర్ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజు నాయక్,శ్రీనివాస్, నరసింహ స్వామి, బాలకృష్ణ, వేంకటేశ్వర రెడ్డి, నారాయణ, కృష్ణ,లాల్ సింగ్,విజయ్,హీర్య,మోహన్ బాబు, వెంకటేష్ నాయక్, రాజు, సురేష్,గోపాల కృష్ణ, సత్యనారాయణ రాజు, కళ్యాణ్ నాయక్, రమేష్, హాసన్ భాయ్,ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

    మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

    800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల.

    సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల.