

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ ఏలేశ్వరం జూనియర్ కళాశాల మైదానంలో దివంగత నేత స్వర్గీయ వరుపుల జోగిరాజు(రాజా) జ్ఞాపకార్థం కాలేజీ గ్రౌండ్ టీం, బొదిరెడ్డి గోపి యువసేన ఆద్వర్యంలో నిర్వహిస్తున్న రాజా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ దివంగత నేత రాజా పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఆయన జ్ఞాపకాలు గుర్తు చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని ఆమె అన్నారు.రాజా క్రీడల్లో ఎక్కువగా పాల్గొనేవారని అందులో క్రికెట్ అంటే ఎక్కువగా మక్కువ చూపించే వారన్నారు.అదేవిధం గా యువకులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఆమె కోరారు.మొదటి బహుమతి రూ 50వేలు(షీల్డ్),ద్వితీయ బహుమతి రూ 30 వేలు(షీల్డ్), తృతీయ బహుమతి రూ 15 వేలు(షీల్డ్).ప్రకటించిన కమిటీ.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోదిరెడ్డి గోపి,మూది నారాయణ స్వామీ,జ్యోతుల పెదబాబు,ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి,మేడిశెట్టి సూర్యకిరణ్, కరణం సుబ్రహ్మణ్యం, గాబు సుభాష్,ఎండగుండి నాగబాబు,అనంతరపు రాజు,వాగు రాజేష్, ఏలేశ్వరం ఎస్సై ఎన్ రామలింగేశ్వరరావు తదితర పాల్గొన్నారు.