అక్రమ తొలగింపుకు గురైన పద్మకు న్యాయం చేయాలి…

  • సిడిపిఓ మొండి వైఖరి నశించాలి..
  • ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి గెడ్డం బుల్లమ్మ డిమాండ్…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : శంఖవరం సమగ్ర శిశు అభివృద్ధి పథకం ప్రాజెక్టు కార్యాలయ అధికారిని మొండి వైఖరి నశించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి గెడ్డం బుల్లమ్మ ద్వజమెత్తారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రామకృష్ణాపురం ఎం. పద్మ అంగన్వాడీ కార్యకర్త అక్రమ తొలగింపు పై శనివారం మధ్యాహ్నం శంఖవరం సమగ్ర శిశు అభివృద్ధి పథకం ప్రాజెక్టు కార్యాలయం ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. సిడిపిఓ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు పలుకుతూ అంగన్వాడీ కార్యకర్తను విధుల్లోనికి తీసుకోకపోతే జిల్లా మరియు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ తరపున ఉద్యమం మరింత తీవ్రతకు దారితీస్తుందని హెచ్చరించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి హెల్పర్స్ మరియు వర్కర్స్ యూనియన్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి గెడ్డం బుల్లమ్మ మాట్లాడుతూ, పది సంవత్సరాలు పైన సేవలందించిన అంగన్వాడి కార్యకర్త ను అక్రమంగా తొలగించడం సరికాదని, తొలగించాలంటే నిబంధనలు ప్రకారం మూడుసార్లు నోటీసులు ఇచ్చి పంచనామా చేసి తొలగించాలని అన్నారు. అంగన్వాడి కార్యకర్త వేసవి సెలవులకు బంధువుల ఇంటికి వెళ్ళగా అంగన్వాడీ కార్యకర్త చేతికి నోటీసు అందించకుండా అంగన్వాడి కార్యకర్త లేదని సిడిపిఓ కి తెలియజేయగా నోటీసును అంగన్వాడీ కార్యకర్త ఇంటికి అంటించమని తెలియజేసినట్లు రౌతులపూడి ప్రాజెక్ట్ సూపర్వైజర్ జానకి తెలిపారని, అంగన్వాడి కార్యకర్త ఎం. పద్మ ను తొలగించినట్లు తెలపకుండానే భవాని అనే ఆమెను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం ఉన్నత అధికారులతో చేతులు కలిపి అక్రమంగా ఆమెను తొలగించారని ఆరోపించారు. రామకృష్ణాపురంలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడి కార్యకర్త ఎమ్. పద్మ కు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని, లేనియెడల జిల్లా మరియు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తలకు సహాయ కార్యకర్తలకు పిలుపునిచ్చి ధర్నాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు బి రత్నకుమారి, ప్రధాన కార్యదర్శి గెడ్డం బుల్లమ్మ, ఎమ్ .సత్యవేణి, సీత, బి. అప్పలరాజు,నూకరత్నం తదితర అంగన్వాడి కార్యకర్తలు, అంగన్వాడి సహాయ కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…