

ఏలూరు మన న్యూస్: – అంతర్జాతీయ ( ఐ.ఎస్.ఒ.) సంస్థ శ్రీశ్రీ కళావేదిక సీఈవో డా. కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో. మే 10,11 ఘనంగా ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు నిర్వహించారు. జిల్లాకేంద్రం ఏలూరులోని మహాలక్ష్మి వేణుగోపాల కల్యాణ మండపం లో జరిగిన ఈ కార్యక్రమాలలో 48 గంటలపాటు నిర్విరామంగా ప్రపంచ కవితా దినోత్సవం, కళా ప్రదర్శనలు, సాహిత్య కళా ప్రదర్శనలు, రంగస్థల, జానపద , వివిధ రంగాల సాంప్రదాయ ప్రదర్శనలు జరిగాయి.ఉభయ తెలుగురాష్ట్రాలనుంచే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాలనుంచి తరలివచ్చిన కవులు, కళా కారులు ‘సాహితీ పట్టాభిషేక మహోత్సవాలు’లో కవితాగానాలు, కళా ప్రదర్శనలు చేసారు. ఈ సందర్భంగా పలువురికి జాతీయ పురస్కారాలు అందజేశారు. బొబ్బిల్లంక ( తూర్పు గోదావరి జిల్లా)గ్రామానికి చెందిన శ్రీ నక్కిన ధర్మేష్ గారికి యువ కీర్తి బిరుదుతో జాతీయ ప్రతిభా పురస్కారాన్ని పూలదండ, శాలువ, పురస్కార పత్రం మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కారం అందుకున్నారు.ఇటీవలె తెలుగు – వెలుగు సాహితీ వేదిక సంస్థ వారిచే జాతీయ మహానంది పురస్కారాన్ని , తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆనం కళాకేంద్రంలో ఉగాది సత్కార పురస్కారాన్ని , ఇతర అనేకమైన కార్యక్రమాల్లో ప్రశంసలు మరియు సత్కారాలు అందుకున్నారు. ధర్మేష్ గారు ఐటీ సాఫ్టువేర్ గా మరియు గేట్ వే స్కూల్ వైస్ డైరెక్టర్ గా పనిచేస్తూ కవిగా, విద్య, సాహిత్య మరియు సామాజిక సేవ కార్యక్రమాల్లో తన వంతు కృషి చేస్తున్నారు. యువ కీర్తి పురస్కారానికి కవులు, రచయితలు, సాహిత్య మరియు విద్యా వేత్తలు శ్రీ నక్కిన ధర్మేష్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు.