అన్నదాత సుఖీభవ పథకం మార్గదర్శకాలు విడుదల

మన న్యూస్ సింగరాయకొండ:- 2025-26 సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభవ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని సింగరాయకొండ మండల వ్యవసాయ అధికారి వి. సుధాకర్ తెలియజేశారు. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ 14000 మరియు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా అందజేస్తున్న రూ 6000 తో కలుపుకొని మొత్తంగా సంవత్సరానికి సాగు ఖర్చుల నిమిత్తం 20000 రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన డేటా వెరిఫికేషన్ స్థానిక రైతు సేవ కేంద్రాలలోని గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా ఆన్లైన్ లోఅన్నదాత సుఖీభవ పోర్టర్లో నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ పథకం వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ సాగుభూమి ఉన్న రైతులు అర్హులు అవుతారని తెలియజేశారు. అన్నదాత సుఖీభవ కు సంబంధించిన డేటా వెరిఫికేషన్ వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుందని తదుపరి డేటా వెరిఫికేషన్ ఆర్టిజిఎస్ పోర్టల్ లో రీవాల్యుయేషన్ అవుతుందని. ఆర్ టి జి ఎస్ ద్వారా పునః పరిశీలించిన రైతుల వివరాలను సంబంధిత స్థానిక రైతు సేవ కేంద్రాలకు పంపడం జరుగుతుంది చివరగా రైతులకు గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ కే వై సి నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. కనుక మండలంలోని ప్రతి రైతు వారి పరిధిలో గల రైతు సేవా కేంద్రాలలోని వ్యవసాయ సహాయకులు కలిసి వారి వారి వివరములు పరిశీలించుకోవాలని తెలియజేశారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..