ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు

శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం జి. కొత్తపల్లి గ్రామంలో మాస్టర్ ట్రైనర్(యమ్ టి)దాడి వరలక్ష్మి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమ ప్రణాళిక ఖరీఫ్ 2025 లో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తపల్లి గ్రామ సర్పంచ్ ఈగల రవికుమార్, అప్పారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఈగల రవికుమార్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వలన ఎంతో మేలు కలుగుతుందని రసాయన వ్యవసాయం చేసే రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని కోరారు. రసాయనిక వ్యవసాయం వలన కౌలు రైతుకు పెట్టిన పెట్టుబడి తప్ప మిగులు ఏమీ ఉండదని, నష్టం వాటిల్లుతుందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తే పెట్టుబడి తక్కువ అవుతుందని తద్వారా లాభం కలుగుతుందని వివరించారు.యమ్ టి వరలక్ష్మి మాట్లాడుతూ ప్రతి రసాయన వ్యవసాయం చేసే రైతు తన రసాయన పద్ధతులు మాని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ పెట్టుబడి తగ్గించుకొని లాభసాటి వ్యవసాయం చేసేందుకు అవగాహన కల్పించారు. కేఏపీ 2025 – 26 ప్రణాళికలో భాగంగా శంఖవరం, రౌతులపూడి మండలాలు కేఏపీ చేయడం జరిగిందని, గతం లో సంఘ సభ్యురాలు తో మాత్రమే కేఏపి చేసేవాళ్ళమని, అందువలన డేటా పూర్తిస్థాయిలో వచ్చేది కాదని, ఇప్పుడు సంఘ సభ్యురాలు భార్యాభర్త లను కూర్చోబెట్టి రాయడం వలన డేటా పూర్తిస్థాయిలో వస్తుందని అన్నారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎలియాజర్ ఆదేశాల మేరకు ప్రతీ మండలం లో మొత్తం డేటాను ముందుగానే సిద్ధం చేసుకోమని చెప్పడం వల్ల కేఏపి సులువుగా చేయడం జరుగుతోందన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్న ఆదర్శ రైతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విఎఎ లు క్రాంతి, బిందు, ఐ సి ఆర్ పి లు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు