

మనన్యూస్,వింజమూరు:స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా, స్వచ్ఛ భారత్ నిధుల నుండి చాకలి కొండ మరియు కాటేపల్లి పంచాయతీలకు మంజూరైన రెండు ట్రాక్టర్లను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు మరియు కార్యదర్శులకు, ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో పంపిణీ చేశారు.ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్లను ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ శ్రీమతి ప్రవీణ దంపతులు టాక్టర్ పైకి ఎక్కి నడిపారు. అనంతరం శ్రీమతి కాకర్ల ప్రవీణ, సర్పంచ్ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్యం మెరుగుకై సుమారు 12 లక్షల రూపాయల విలువ కలిగిన ట్రాక్టర్లను పంపిణీ చేయడం జరిగింది అన్నారు. వీటిని వినియోగించుకొని గ్రామాలలో పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. టాక్టర్ల ద్వారా సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు తరలించి సంపద సృష్టించాలని తెలిపారు. ఇంతకాలం వాహనం లేని ఈ రెండు పంచాయతీలకు వాహనాలు రావడం పట్ల గ్రామ సర్పంచులు నాయకులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో చాకలి కొండ సర్పంచ్ కుమారి ఉప్పి రెట్ల సుబ్బలక్ష్మి కుమారి డాక్టర్ వెంకటేశ్వర్లు పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య వింజమూరు మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ కొండాపురం మాజీ జడ్పిటిసి సభ్యులు దామా మహేష్ టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష కాటేపల్లి సర్పంచ్ ముప్పూరి విజయ లక్ష్మమ్మ లెక్కల వెంగళరెడ్డి దిండు నారాయణ ఉప సర్పంచ్ నాగేంద్రబాబు కేశవ నారాయణ దిండు కిరణ్ దిండు వెంకటేష్ కార్యదర్శులు శేఖర్ షరీఫ్ తదితరులు ఉన్నారు.
