స్వార్థ రాజకీయాల కోసం, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాయొద్దు

వైసీపీ శ్రేణులకు హితవు పలికిన టిడిపి మహిళా నేత మమత

Mana News :- తిరుపతి, నవంబర్ 12,(మన న్యూస్ ) :- స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాయొద్దని, నిబద్ధతతో పనిచేసే అధికారుల మనోభావాలను సోషల్ మీడియా వేదికగా…, దెబ్బతీయద్దంటూ వైసీపీ శ్రేణులకు హితవు పలికారు టిడిపి మహిళా నేత మమత. కూటమి ప్రభుత్వాన్ని ,పోలీస్ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసిన కొందరి వైసిపి నేతల తీరును మంగళవారం తిరుపతిలో మమత ఖండించారు. శాంతి భద్రతలకు పెద్దపీట వేసే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.., క్రమశిక్షణ, నైతిక విలువలు కలిగిన అధికారులను ఎంపిక చేసుకుని ఉద్యోగ బాధ్యతలు అప్పగిస్తారని ఆమె తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని సీఎం చంద్రబాబు ఉపేక్షించరని మమత గుర్తు చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే ఏపీ సీఎం చంద్రబాబు.., ప్రజలకు సేవ చేసే నిబద్దత, చిత్తశుద్ధితో విధులను సక్రమంగా నిర్వర్తించే అధికారుల సేవలను సద్వినియోగం చేసుకుంటారన్న విషయాన్ని వైసిపి విస్మరించడం బాధాకరమన్నారు. ఆ కోవకు చెందిన వారే తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అని ఆమె అన్నారు. చట్టానికి లోబడి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న తిరుపతి జిల్లా ఎస్పీని లక్ష్యంగా చేసుకొని, వైసిపి మూకలు సోషల్ మీడియాలో ఇష్టారీతిన వ్యవహరించడం, వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ మోహన్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఉందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని నియంత్రించి, పనిచేసే ప్రభుత్వానికి సహకరించాలని మమత విజ్ఞప్తి చేశారు. అప్పుడే రాష్ట్ర ప్రజలు హర్షిస్తారని, అలా కాదని ముందుకెళితే భవిష్యత్తులో వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు మమత.

  • స్వార్థ రాజకీయాల కోసం, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాయొద్దు…
  • నిబద్ధత కలిగిన అధికారుల మనోభావాలను దెబ్బ తీయొద్దు..
  • హద్దులు మీరితే ప్రజల నుంచి గుణపాఠం తప్పదు…
  • వైసీపీ శ్రేణులకు హితవు పలికిన టిడిపి మహిళా నేత మమత

Related Posts

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉరవకొండ మన ధ్యాస: నిమ్న వర్గాల గౌరవానికి సంబంధించిన విషయం బలహీనవర్గాల విజయం అని తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యల్.నాగేంద్ర కుమార్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ఉప రాష్ట్రపతి బాధ్యతలలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం