

Mana News :- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మన న్యూస్….వర్షం వ్యక్తం చేసిన ఎస్టీ సెల్ తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు. ఎన్డీఏ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన2024-2025 బడ్జెట్లోఎస్టీల ఆర్థికాభివృద్ధి పై
ప్రత్యేక దృష్టి సారించి గిరిజన సంక్షేమానికిరూ.7,557 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంనందు ఎస్ టి సెల్ తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సుబ్బయ్య పార్టీ శ్రేణులతో మరియు గిరిజనులతో కలసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు, ఎస్ టి సెల్ తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సుబ్బయ్య మాట్లాడుతూ…తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పర్యాయం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్టీల ఆర్థికాభివృద్ధి పై ప్రత్యేక దృష్టిసారించి గిరిజన సంక్షేమానికి రూ.7,557 కోట్లు కేటాయించి,గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి ,గిరిజనులకు అందుబాటులో నాణ్యమైన విద్య,పౌష్టికాహారం ,పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్, ఆర్.టి.ఎఫ్,ఎం.టి.ఎఫ్, విదేశీ విద్యానిధి పథకాల అమలు
గిరిజనుల ఆరోగ్య సంరక్షణకు ఈ బడ్జెట్ తో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పడం ఓ గిరిజనుడుగా తాను హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో గిరిజనులను పట్టించుకున్న దాఖలాలు లేవని, అయితే నేడు తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా పరిపాల కొనసాగిస్తున్నారన్నారు, గిరిజనుల అభ్యున్నతికై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ఆయన తిరుపతి జిల్లా గిరిజనుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
బైట్… సుబ్బయ్య ఎస్టీ సెల్ తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు