తహశీల్దార్ కార్యాలయం ముందు యువకుడిఆత్మహత్యాయత్నం…


మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, ఏళ్లు గడుస్తున్నా తనకు అధికారులు రేషన్ కార్డు జారీ చేయడం లేదని, విసుగు చెందిన యువకుడు గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజాంసాగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామానికి చెందిన సందీప్ గౌడ్ అనే యువకుడు గురువారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో రెవెన్యూ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని సందీప్ గౌడ్ ను అడ్డుకున్నారు. సందీప్ గౌడ్ కు 2019లో వివాహం జరిగింది. వివాహం అనంతరం ఆరు నెలల తర్వాత వారి తల్లిదండ్రులతో కలిపి ఉన్న రేషన్ కార్డులో అతని పేరును తొలగించుకున్నాడు. అయితే తన భార్యతో కలిపి తనకు నూతన రేషన్ కార్డ్ ఇవ్వడం లేదని అధికారులు కావాలనే తనను రేషన్ కార్డు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పెట్రోల్ డబ్బాతో వచ్చి తహశీల్దార్ కార్యాలయం ముందు తన ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. ఇంతలో తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి సందీప్ గౌడ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అనంతరం సందీప్ గౌడ్ ను సముదాయించి తహశీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. తనకు కావాలనే రేషన్ కార్డు ఇవ్వడం లేదని తాను రేషన్ కార్డు కోసమే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనతోపాటు తహశీల్ధార్ పైన కూడా పోస్తానంటూ వాగ్వివాదానికి దిగాడు.దీంతో తహశీల్దార్ బిక్షపతి సందీప్ గౌడ్ ను సముదాయించి పంపించి వేశాడు. ఇప్పటివరకు రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోలేదని, ఇప్పుడు రేషన్ కార్డు కావాలని దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తహశీల్దార్ తెలిపారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///