ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించి వారి ఆర్థిక బకాయిలు తక్షణమే చేల్లించాలని డిమాండ్ చేసిన ఎస్ టి యూ కార్యవర్గ సభ్యులు

మన న్యూస్ యాదమరి ఆగస్ట్-20

ఈరోజు యాదమరి  మండలంలో వివిధ పాఠశాలలను సందర్శించి రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టియూ) సభ్యత్వ స్వీకరణ, ఉపాధ్యాయుల సమస్యల సేకరణ కార్యక్రమము  నిర్వహించడమైనది. ఈ సందర్భంగా ఎస్టియూ చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయులకు సుమారు 25 వేల కోట్ల  ఆర్థిక బకాయిలను వెంటనే దశలవారీగా చెల్లించాలని, ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న డీఏ లను మంజూరు చేయాలని, 12 వ పిఆర్సి కమిషన్ చైర్మన్ ను నియమించి 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఆలస్యం చేయకుండా ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న మెమో 57 ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసి  2003 డీఎస్సి ద్వారా నియామకం పొందిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, అలాగే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు  సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయడమైనది. అలాగే ఇటీవల పాఠశాలలో అమలు చేస్తున్న నూతన మూల్యాంకన విధానం  రద్దు పరచాలని డిమాండ్ చేశారు. దీనివలన పాఠశాలలో ఎక్కువ సమయం విద్యార్థులకు పాఠాలు బోధించే వీలు లేకుండా మూల్యాంకన పుస్తకాలను  విద్యార్థులచే రాయించడంలో సమయం వృధా అవుతుందని  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు యాదమరి మండల శాఖ అధ్యక్షులు  విశ్రాంత ఉపాధ్యాయులు గుణశేఖర్, యాదమరి మండల శాఖ ప్రధాన కార్యదర్శి రమేష్ మరియు సంఘ నాయకులు సుబ్రహ్మణ్యం పిల్లె, రంగనాథం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///