

పినపాక, మన న్యూస్ :- పినపాక మండలంలోని జానంపేటలో స్థానిక సంస్థల బిజెపి ఎన్నికల కార్యశాల బిజెపి మండల అధ్యక్షుడు శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కన్వీనర్ పున్నం బిక్షపతి ముఖ్య అతిథగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పున్నం బిక్షపతి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలని, మండలంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజాప్రతినిధులు కావాలని ప్రజలకు సేవ చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పటేల్ వెంకట్ నారాయణ, పొనగంటి రామకృష్ణ, గంప చంద్రకుమారి, పాటిబండ్ల శ్రీనివాస్, పొనగంటి సతీష్, షేర్ మల్లయ్య, భూత, మొదలైన వారు పాల్గొన్నారు.