తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాఠశాలను ఆపండి.. సి.ఐ.టి.యు

గూడూరు, మన న్యూస్ :- తల్లిదండ్రులు తమ పిల్లల మీదున్న శ్రద్ధతో మా ఊరు బడి మాకు కావాలి – బయట గ్రామాలకి మా పిల్లలను పంపించలేం అంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేయడంపై శుక్రవారం రోజు తిరుపతి జిల్లా గూడూరు మండలంలోని యం.ఇ.ఓ. డి. రవీంద్రబాబును స్థానిక సి.ఐ.టి.యు నాయకులు కలిసి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామాలలోనికి వెళ్లి పాఠశాలలకు తమ పిల్లలను పంపమని వారి తల్లిదండ్రులను కలిసి విద్యార్థులకు చదువులు ఆపవద్దు, దయచేసి చదివించండి, పాఠశాలకు పంపించండి, అని వారికి తెలియజేయడం జరుగుతూ ఉందని, తల్లిదండ్రులు జూలై 10 వరకు గడువు కోరడం జరిగిందని, ఆయన తెలియజేశారు. ఆయా పాఠశాలలకు ఒక కిలోమీటరు పైబడి దూరం ఉన్న విద్యార్థులను గుర్తించి సమాచారం ఇవ్వమని ఉపాధ్యాయులకు తెలియజేయడం జరిగిందని, విద్యార్థుల రవాణా ఖర్చులకు గాను ప్రతి విద్యార్థికి నెలకు రూ.1000/-(వెయ్యి రూపాయలు) లెక్కన వారికి సంబంధించిన తల్లికి వందనం అకౌంట్లలో జూన్,జూలై,ఆగస్టు నెలలకు సంబంధించి రూ.3000/- రూపాయలు వేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవహరించిన బాటలోనే కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ తమ పిల్లలను చదువుకు దూరం చేయడంతో దూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ఎటువంటి రవాణా సౌకర్యం లేకపోవడం తల్లిదండ్రులు చదువుకు స్వస్తి పలికి ఇంటి దగ్గరే పిల్లలను ఉంచుకోవడం జరుగుతూ ఉంది. ఇకనైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు, నాయకులు కలగచేసుకొని ఆయా పాఠశాలలు పక్కనే అదనపు గదులు ఏర్పాటు చేసి తరగతులకు సంబంధించిన ఉపాధ్యాయులను నియమించి చదువులు కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గూడూరు డివిజన్ ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్, గూడూరు పట్టణ సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి బి.వి. రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 5 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.