Tag: #andhrapradesh

కడపలో నిర్వహించిన ఎస్‌టియు రాష్ట్ర కార్యవర్గ సమావేశం – ఉపాధ్యాయ సమస్యలపై చిత్తూరు జిల్లా శాఖ డిమాండ్లు

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-12 కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన ఎస్‌టియు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి ఉపాధ్యాయుల సమస్యలను స్పష్టంగా ప్రస్తావించారు. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ…

బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-8 యాదమరి మండలం తెల్లరాళ్లపల్లె ప్రాధమికోన్నత పాఠశాలలో ఆదర్శ సేవాభావంతో కూడిన కార్యక్రమం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయుడు పి. సోమశేఖర్ తల్లి జన్మదినాన్ని పురస్కరించుకుని, బడిలోని 50 మంది విద్యార్థులకు భోజనానికి ఉపయోగించే ప్లేట్లు, గ్లాసులు అలాగే…

‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

చిత్తూరు, మన ధ్యాస డిసెంబరు-7‎ఈరోజు చిత్తూరు పట్టణంలోని విజయం విద్యాసంస్థల్లో జరిగిన ఎస్‌టియు 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో చిత్తూరు జిల్లా శాఖ కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా శాఖ అధ్యక్షులుగా రెండవ సారి ఎన్‌.ఆర్‌.…

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-6 యాదమరి మండలంలో ఇటీవ‌ల బదిలీపై చేరిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత గౌరవం, వారి పాత్రకు తగ్గ బాధ్యతలు అప్పగించినట్లు మండల అధ్యక్షులు ఎ.శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి బి.సురేష్ రెడ్డి తెలిపారు. కె.ఆర్‌.పి హైస్కూల్ విభాగం కార్యదర్శిగా…

వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

యాదమరి, మన ధ్యాస, డిసెంబరు-6: పదవ తరగతి విద్యార్థుల పరీక్షల తర్పీదు కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వందరోజుల కార్యక్రమం పురోగతిని పరిశీలించేందుకు స్పెషల్ ఆఫీసర్, ఎం.పి.డి.ఒ. పి. వీరేంద్ర ఈరోజు కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా…

ఎస్‌టియు జిల్లా కౌన్సిల్ సమావేశం – విజయవంతం చేయండి

చిత్తూరు, మన ధ్యాస, డిసెంబరు-5: ఎస్‌టియు చిత్తూరు జిల్లా శాఖాధ్వర్యంలో జిల్లా కౌన్సిల్ సమావేశం డిసెంబర్ 7వ తేదీ, ఆదివారం నాడు చిత్తూరు పట్టణంలోని విజయం విద్యాసంస్థలు, పుత్తూరు రోడ్డు, హెరిటేజ్ పార్లర్ సమీపంలో నిర్వహించనున్నట్లు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్…

వరిగపల్లె పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్‌ – విద్యాభివృద్ధికి తొలి మెట్టు

యాదమరి, స్వర్ణసాగరం, డిసెంబరు-5: యాదమరి మండలంలోని వరిగపల్లె ప్రాధమిక పాఠశాలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ ఆకర్షణీయంగా, సందేశాత్మకంగా సాగింది. హెచ్‌.యం. జె. హిమబిందు సమన్వయంతో జరిగిన ఈ సమావేశం పాఠశాలలో విద్యార్థుల అభ్యాసం, సంక్షేమం, అభివృద్ధి పై తల్లిదండ్రుల్లో చైతన్యం…

పండుగ వాతావరణంలో వైభవంగా మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0

యాదమరి, మన ధ్యాస, డిసెంబరు-5: యాదమరి మండలంలోని కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌లో మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 ను పండుగ వాతావరణంలో అత్యంత భవ్యంగా నిర్వహించినట్లు హెచ్‌.యం. ఎ.పి. లలిత తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని…

యాదమరి మండలం నుండి ఎస్‌టియు నూతన కార్యవర్గం ప్రకటితం

యాదమరి, మన ధ్యాస, డిసెంబరు-04 చిత్తూరు జిల్లా ఎస్‌టియు శాఖ కార్యాలయంలో ఈరోజు జరిగిన కీలక కౌన్సిల్ సమావేశంలో యాదమరి మండల ఎస్‌టియు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం పిళ్ళై ఎన్నిక కాగా, గౌరవాధ్యక్షులుగా విశ్రాంత ఉపాధ్యాయులు గుణశేఖరన్…

తవణంపల్లి మండల ఎస్‌.టి‌.యు. కొత్త కార్యవర్గం ఎన్నిక

తవణంపల్లె, మన ధ్యాస, డిసెంబరు-4: చిత్తూరు జిల్లా ఎస్‌.టి‌.యు. శాఖ కార్యాలయంలో తవణంపల్లి మండల శాఖ కౌన్సిల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో మండలానికి సంబంధించిన నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మధు బాబు అధ్యక్షుడిగా, వినాయక…