ఘనంగా పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం- ఉల్లాసంగా ఉత్సాహం గడిపిన వైనం గురువులను సన్మానించి ఆశీర్వచనాలు తీసుకున్న పూర్వ విద్యార్థులు

తవణంపల్లి, మార్చి 9 మన న్యూస్

మండలలోని అరగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985 – 86:వ సంవత్సరం 10 వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. అరగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి విశ్రాంత ఉపాధ్యాయులు యాగమూర్తిపిళ్ళై, ఎల్ కృష్ణారెడ్డి సుందరరాజులు, జగత్ జ్యోతిశ్వరరెడ్డి, వెంకటస్వామి, బాబుసాహెబ్, కృష్ణమూర్తినాయుడు, రాజేశ్వరి, లోకేశ్వరి, శ్రీదేవి, మొగిలమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు యాగమూర్తిపిళ్లై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను బాగా చూసుకున్న రోజే వారి చదువులకు సార్థకత అవుతుందన్నారు. అదే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెడుదారి పట్టకుండా చదివించుకుని, వారి అభివృద్ధికి పాటు పడాలన్నారు. ముఖ్యంగా తమ పిల్లలు సెల్ ఫోన్లు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పలువురు పూర్వ విద్యార్థులు ప్రసంగించారు. 39 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ ఒకచోట కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు గడపడం సంతోషాన్నిస్తోందన్నారు. అదే క్రమంలో తమకు విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఎదిగేందుకు అన్ని విధాల సహకరించిన ఉపాధ్యాయులను సత్కరించుకోవడం మరింత ఆనందాన్నిస్తోందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్చార్జి కోరిక మేరకు పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తమ వంతు సాయం చేస్తామని పూర్వ విద్యార్థులు హామీ ఇచ్చారు చివరగా కార్యక్రమానికి హాజరైన విశ్రాంత ఉపాధ్యాయులను దృశ్యాలవులతో ఘనంగా సన్మానించి కానుకలు అందజేశారు. అంతకుముందు ఉదయం పూట అల్పాహారం మధ్యాహ్నం సహపంక్తి భోజనం చేసి నా పూర్వ విద్యార్థులు ఒకరు ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ తమ గత స్మృతులను నెమరువేసుకున్నారు. కాగా ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమ నిర్వాహకులు కేబీ ఉమాపతి, పి రామకృష్ణ, ధర్మేంద్ర, జయంతిరెడ్డి, మన్నారు ప్రసాద్, కుమార్ నాయుడు, రెడ్డిప్రసాద్, మాధవి, కమలాపతి, సుకుమార్, పూర్ణచంద్ర, శ్రీనివాసులుతో పాటు దాదాపు 200 మందికి పైగా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!