మళ్లీ తెరపైకి నకిలీ నోట్ల మూట,నకిలీ నోట్ల ముఠాను అరెస్ట్ పోలీసులు

మనన్యూస్, కామారెడ్డి: జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సదాశివనగర్ మండల పోలీస్ స్టేషన్లో డిఎస్పీ శ్రీనివాసులు, సీఐ సంతోష్ కుమార్ లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక లక్షా 45 వేల విలువ గల 500 రూపాయల,31,400 విలువ గల 200 రూపాయల నోట్లను స్వాదీనపరుచుకున్నట్టు తెలిపారు.గాంధారి మండలం చద్మల్ తండా లో లక్ష్మమ్మ జాతర సందర్భంగా 500,200 రూపాయల నకిలీ నోట్లు వెలుగు చూసాయని తెలిపారు.ఆలయ క్యాషియర్ మూడు గోపాల్, రవీందర్ లు హుండీ డబ్బుల్లో నకిలీ నోట్లు కలిపి ప్రజలకు మిత్తికి ఇచ్చే సందర్భంలో ఒక 500 రూపాయల కట్టలో ఒకటి లేదా రెండు నోట్లు నకిలీ 500 రూపాయల నెట్లను కలుపుతూ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.ఇట్టి నోట్లను నిర్మల్ జిల్లాకు చెందిన తిరుపతి అలియాస్ రాజు అనే వ్యక్తి అలాగే విజయవాడకు చెందిన జగన్ అలియాస్ రాము అనే వ్యక్తుల ద్వారా అందినట్లు విచారణలో తేలిందని అన్నారు.ఈ నేరంలో భాగస్తులైన మాండు గోపాల్,మాలి రవీందర్,బడావత్ సంగ్రామ్,మూడు రవీందర్, దరావత చందర్,మగిడి కేషన్,రామ్,టింకి భాను ప్రసాద్ అనే ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు.నేరస్థుల వద్ద నుంది 9 మొబైల్ ఫోన్లను, ఒక బైకు,1,45,500/- విలువగల 500 రూపాయల 291 నకిలీ నోట్లను, 31,400 రూపాయల విలువ గల 200 రూపాయల 157 నకిలీ నోట్లు స్వాధీనపరుచుకునట్టు తెలిపారు.మిగతా నోట్లో ను నేరస్తులు కాల్చివేయడం జరిగినదని వెల్లడించారు.నేర విచారణలో చాకచక్యం ప్రదర్శించి నేరస్తులను పట్టుకున్న సదాశివనగర్ సిఐ సంతోష్ కుమార్,గాంధారి ఎస్పై ఆంజనేయులు,టెక్నికల్ టీమ్,ఐడి పార్టీ టీమ్ సభ్యులను ఎస్పీ సింధు శర్మ అభినందించారని ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

  • Related Posts

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ…!!!

    కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ…!!!

    నెల్లూరు రూరల్ లో ఘనంగా ప్రారంభమైన చంద్రన్న పల్లె పండుగ

    నెల్లూరు రూరల్ లో ఘనంగా ప్రారంభమైన చంద్రన్న పల్లె పండుగ

    సిపిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా అసహ్యంగా ఆలోచిస్తున్నారు…… జనసేన నేత గునుకుల కిషోర్

    సిపిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా అసహ్యంగా ఆలోచిస్తున్నారు…… జనసేన నేత గునుకుల కిషోర్

    రాష్ట్రంలో టీచర్ల బదిలీల ను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

    రాష్ట్రంలో టీచర్ల బదిలీల ను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు

    వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి