

మనన్యూస్,ఆదిభట్ల:మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో 6కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,అదేవిధంగా పనులు పూర్తయిన వాటికి స్థానిక కౌన్సిలర్లతో కలిసి ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు.అనంతరం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా 15 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించారు.దశలవారీగా ఈ యొక్క పనులు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి సూచించారు.అనంతరం చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ బాలకృష్ణ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కో ఆప్షన్ నెంబర్, కౌన్సిలర్ల అందరికీ శాలువాతో ఘనంగా సత్కరించి మెమొంటోలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి,వైస్ చైర్మన్ కామన్ల యాదగిరి,కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్,వివిధ శాఖల అధికారులు,కార్యాలయ సిబ్బంది,మున్సిపాలిటీ సిబ్బంది,పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.