

మనన్యూస్,కామారెడ్డి:పాల్వంచ మండలం వాడి గ్రామం లో లొట్టి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం మేరకు అందాజా ఆరు గంటలకు వాడి విలేజ్ లోని లొట్టి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను సీజ్ చేయడం జరిగిందని అక్రమంగా ఇసుక తరలిస్తున్న జీడిపల్లి రాజిరెడ్డి చుక్కాపూర్ అను అతని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై అనిల్ తెలిపారు మండల కేంద్రంలో ప్రజలు అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు.