పండుగ వాతావరణంలో యాదమరి – గుడియాత్తం రోడ్డు పనులకు భూమి పూజ.

యాదమరి డిసెంబర్ 14 మన న్యూస్

పూతలపట్టు నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతమైన యాదమరి మండలంలో రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం యాదమరి మండలం,‌ కాశిరాళ్ళ గ్రామం వద్ద జరిగిన యాదమరి – గుడియాత్తం రోడ్డు అభివృద్ధి పనులకు చిత్తూరు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ ఐఏఎస్ తో పాటుగా పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిధులుగా విచ్చేసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గోన్నారు. పూతలపట్టు నియోజకవర్గం నుండి విశేషంగా హాజరైన నాయకులు, కార్యకర్తలు, యాదమరి మండల ప్రజల నడుమ ఈ భూమి పూజ కార్యక్రమం పండుగ వాతావరణం జరిగింది. అయితే ఎమ్మెల్యే చొరవతో యాదమరి – గుడియాత్తం రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. యాదమరి ప్రజల ఐదేళ్ళ కళను నెరవేర్చిన ఎమ్మెల్యే మురళీమోహన్ కి యాదమరి మండల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసారు. ఎన్నికలకు ముందు రోడ్డు కోసం గ్రామస్తులతో కలిసి నిరసన చేపట్టిన మురళీమోహన్ పై గత ప్రభుత్వం కేసులు కూడా పెట్టించింది. అయితే ఆ కేసులకు ఏ మాత్రం భయపడని మురళీమోహన్ తాను ఎమ్మెల్యే ఐన వెంటనే రోడ్డు సమస్య పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే మురళీమోహన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. యాదమరి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకూ మాట నిలబెట్టుకోవడం జరిగిందని, మొత్తం 7.10 కోట్ల‌ రూపాయలతో యాదమరి రోడ్డు పనులు చేపడుతున్నామని, వీలైనంత త్వరగా యాదమరి ‌- గుడియాత్తం రోడ్డును నిర్మిస్తామన్నారు. తన జీవితంలో మొట్టమొదటి కేసు ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాడుతుంటే నమోదు అయిందని, దానికి తాను ఏమాత్రం భయపడకుండా పోరాటం‌ సాగించినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. యాదమరి మండలంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు.‌ డ్వాక్రా మహిళలను ఆర్ధికంగా బలపరిచేందుకు అవసరమైన పరిశ్రమలు తీసుకొస్తానని, అందుకు కావాల్సిన ప్రతిపాదనను తయారు చేయడ‌ం జరిగిందన్నారు. నారా చంద్రబాబు నాయుడు కి ఇచ్చిన మాట ప్రకారం ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటూ ప్రతి ఇంటికి పెద్ద కొడుకై సమస్యలు పరిష్కారిస్తానని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ‌పెద్ద ఎత్తున ప్రజలు పాల్గోన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 7 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…