మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హనుమంత్ యాదవ్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఇటీవల రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ గాంది,రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశామని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హనుమంతు యాదవ్ తెలిపారు.ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే యూత్ కాంగ్రెస్ మున్ముందు కేటీఆర్ పై తీవ్రంగా ఆందోళన చేపట్టవలసి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐ వై సి జిల్లా జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అబ్భూ, జనరల్ సెక్రెటరీ హాజీమ్ పటేల్, ఎన్ ఎస్ యు ఐ మండల ప్రెసిడెంట్ బసవరాజ్ పటేల్, విలేజ్ యూత్ కాంగ్రెస్ బాలు యాదవ్, గంగాధరే అబ్జల్, అవినాష్, సాయబ్ రావ్, యువజన నాయకులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *