నెల్లూరులో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజనం మహోత్సవం

మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 16:జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు లలితా రామ్ , సమాధి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పడారిపల్లి గంగమ్మ దేవస్థానం వద్ద కార్తిక వన భోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ భూదాటి రాధయ్య మాజీ మేయర్ నంది మండలం భాను శ్రీ, జనసేన జిల్లా నేత నూనె మల్లికార్జున యాదవ్ , వైసిపి నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ , పి.ఎల్ రావు, యనమల నాగేశ్వరావు యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. బీసీ సంఘీయులందరినీ ఒక వేదిక మీదకు తీసుకొని వచ్చి కార్తీక వనభోజనాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. బీసీలందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు నక్క దినేష్ యాదవ్, పవన్ కుమార్ యాదవ్, దువ్వూరు అరుణమ్మ, ముత్యం గౌడ్, కందుకూరి శ్రీ కుమార్, రావులపల్లి వెంకట జ్యోతి, శ్రీహరి, సోమాగోపాల్, రామ్మో హన్, ఉడతా మురళి, లక్ష్మీ యాదవ్, లక్ష్మి, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర