శీల నిర్మాణం ద్వారా సమాజాన్ని రక్షించాలి – డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పిలుపు

తిరుపతి, మన ధ్యాస: తల్లి తండ్రులు పిల్లల్లో శీల నిర్మాణం ద్వారా సమాజాన్ని రక్షించాలని సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు. సోమవారం ఎస్ ఓ ఎస్ పిల్లల గ్రామంలో పిల్లల శీల నిర్మాణంలో తల్లుల పాత్రపై అవగాహన కల్పించారు. ఆధునిక సమాజంలో నైతిక విలువలు క్షీణించడం వల్ల అవినీతి, అక్రమాలు, లంచగొండితనం, అసాంఘిక కార్యకలాపాలు పెరిగి పోయాయన్నారు. కొందరు యువకులు వ్యసనాలకు బానిసలై సమాజానికి హాని చేస్తున్నారన్నారు. కొందరు ఉద్యోగుల్లో లంచగొండి తనం పెరిగిపోయి సామాన్యులను దోచుకుంటున్నారని చెప్పారు. కొన్ని సామాజిక వ్యవస్థల్లో అక్రమాలు పెరిగి పోతున్నాయని చెప్పారు. ఇలాంటి వారంతా ఒక తల్లి కన్న పిల్లలే అన్నారు. బాల్యం నుంచి విలువల నేర్పక పోవడమే ఇందుకు కారణం అన్నారు. తల్లి చెప్పిన రామాయణం విని, భగవద్గీత చదివి గాంధీ దేశానికి స్వతంత్రం చేసారని చెప్పారు. ఇప్పటి తల్లులు కథలు చెప్పడం, విలువలు నేర్పడం తగ్గిపోయిందన్నారు. దీని వల్ల పిల్లల్లో సమగ్ర వ్యక్తిత్వం నిర్మాణం కాలేదన్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం పరిశీలిస్తే దారి తప్పు తున్న ప్రమాణాలు దర్శనమిస్తాయి చెప్పారు. పతనం అవుతున్న విలువలకు అద్దం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో తల్లి తండ్రులు బాల్యం నుంచే పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం, సామాజిక స్పృహ పట్ల శ్రద్ధ చూపాలని కోరారు. కార్యక్రమంలో లోకల్ ఇంచార్జి వి సత్యనారాయణ, కో వర్కర్ టి మునిరత్నం, సమీప గ్రామాల మహిళలు పాల్గొన్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?