శోకసముద్రంలో మునిగిపోయిన గోళ్ల వారిపల్లెఅన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

దేవుడు ఎక్కడున్నాడో చెప్పండి అయ్యా..!ఒక్కరినైనా ఇవ్వమని మొక్కుతా..! అనూష తల్లి ధనమ్మ.. ఆర్ధనాధాలు.,బస్సు ప్రమాదంలో అగ్నికి ఆహుతైన మృతదేహాలు గోళ్ల వారి పల్లి గ్రామానికి చేరిక..!గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో జరిగిన సంఘటనలు చెబుతూ బోరున విలపించిన కుటుంబ సభ్యులు..!

వింజమూరు అక్టోబర్ 26 :(మన ధ్యాస న్యూస్ ):///

దేవుడు ఎక్కడున్నాడో చెప్పండి అయ్యా.. నా బంగారు తమ్ముణ్ణి, నా కూతురు మనవడు, మనమరాల్ని బ్రతికించమని వేడుకుంటానని, ధనమ్మ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని పట్టుకొని బోరున విలపించారు. కర్నూలు బస్సు ప్రమాదంలో అగ్నికి ఆహుతైన మృతదేహాలు గోళ్ల వారిపల్లెకు చేరుకునే క్రమంలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే వారి నివాసానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు జరిగిన పరిణామాలను వివరిస్తూ బోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. గోళ్ల వారిపల్లె గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. గ్రామానికి పార్థివ దేహాలు చేరుకోవడంతో ఆర్ధనాధాలు మిన్నంటాయి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అంత్యక్రియల ఏర్పాట్లకు అన్ని సిద్ధం చేసుకోవాలని, దానికి అవసరమైన ఖర్చులు మొత్తం నేనే భరిస్తానని, స్థానిక నాయకులతో తెలిపి, ఏర్పాట్లను సిద్ధం చేయించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి కుటుంబ పెద్దగా అన్నీ తానై ఎమ్మెల్యే చూసుకుంటున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎమ్మెల్యే దాతృత్వం మరువరానిదని, చుట్టపు చూపుగా కాకుండా, ప్రేమ అభిమానాలు చూపుతూ, బాధలో కుటుంబానికి అండగా నిలిచిన తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే వెంట మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ జూపల్లి రాజారావు, చాకలి కొండ మరియు గోళ్ల వారిపల్లె నాయకులు బంధు మిత్రులు తదితరులు ఉన్నారు.

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి అక్టోబర్ 28 :(మన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?