వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టండి..!జిఎస్టి తగ్గింపుతో అన్ని రంగాలు అభివృద్ధి..!18% నుండి 5 శాతం జీఎస్టీ తగ్గింపు లబ్ధిదారులకు ఎంతో ఆదా..!

భారీగా తగ్గనున్న వాహనాలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రికల్ మరియు నిత్యవసర వస్తువులు..!సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే..!సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

వింజమూరు సెప్టెంబర్ 30 :(మనధ్యాస న్యూస్):////వైసిపి అసత్యపు ఆరోపణలను గ్రామస్థాయి నుండి మండలం మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు తిప్పి కొట్టాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. మంగళవారం వింజమూరు లోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 122 మంది బాధితులకు సుమారు ఒక్క కోటి ఒక్క లక్ష 75 వేల రూపాయల చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తూ ప్రజలపై ఎలాంటి భారం పడకుండా నేరుగా ప్రజలకే లబ్ధి చేకూరే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. డబల్ ఇంజన్ ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. జీఎస్టీ తగ్గింపుతో వాహనాలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, నిత్యవసర ధరలు, సుమారు 13% తగ్గినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రానికి నష్టం చేకూరుతున్నప్పటికీ, ప్రజలకు మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రోజుకి సుమారు 8 కోట్ల రూపాయలు దీని ద్వారా ప్రభుత్వానికి నష్టమన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనిని కూటమి నేతలందరూ ప్రజల్లోనికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అనుభవం ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశారని ఆ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి దక్కిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తో ఎంతో మేలు చేకూరుతుందన్నారు. తల్లికి వందనం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు నేరుగా 13,000 జమ చేయడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను 3000 నుండి 4000, వికలాంగులకు 6000, డయాలసిస్ పేషెంట్లకు 15,000 రూపాయలు పెంచి ప్రతి నెల ఒకటో తేదీ అందజేయడం జరుగుతుందన్నారు. భూ టైటిల్ యాక్టును రద్దుచేసి రైతులకు ఎంతో మేలు చేశారన్నారు. మహిళలకు ఉచితంగా ఏడాదికిమూడు సిలిండర్లు అందజేస్తున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ ధార రైతన్నల ఖాతాలకు సంవత్సరానికి 20,000 అందజేయడం జరుగుతుందన్నారు. అందులో మొదటి విడత 7,000 రూపాయలు అందించడం జరిగిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, అమరావతి మరియు పోలవరం నిర్మాణాలను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రమిస్తున్నారని తెలిపారు. ఆ బాటలో మనమందరం కూడా పయనించాలని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లాలన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!