సహజ సిద్ధంగా అడాలి వ్యూ పాయింట్,జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి,

మన ధ్యాస పార్వతీపురం, సెప్టెంబర్ 23:- అడాలి వ్యూ పాయింట్ అతి సుందరమైన ప్రాంతమని, పర్యాటకులను ఆకర్షించేలా ఈ ప్రాంతాన్ని సహజ సిద్ధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సీతంపేట వద్ద గల అడాలి వ్యూ పాయింట్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యుత్తమ పర్యాటక ప్రదేశాల్లో ఒకటని, జిల్లా యంత్రాంగం మంచి పర్యాటక కేంద్రంగా గుర్తించి కొన్ని సౌకర్యాలు కల్పించిందని అన్నారు. అయితే ప్రకృతి సిద్ధంగా ఉండి, ఆహ్లాదకర వాతావరణంలో ఉండే ఈ వ్యూ పాయింట్ లో కాంక్రీటుతో కట్టిన కట్టడాలు కన్నా వెదురుతో చేసిన కట్టడాల వలన సహజసిద్ధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయడం వలన విశేషంగా పర్యాటకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసి వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విచ్చేసే పర్యాటకులకు అవసరమైన అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అంతకుముందు పాలకొండ మునిసిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన పట్టణాభివృద్ధికి అవసరమైన టౌన్ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. మునిసిపల్ పరిధిలో ఉండే చెరువులను అభివృద్ధి చేయాలని, చెరువుల చుట్టూ మొక్కలను నాటి సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని అన్నారు. అలాగే చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేయడం వలన పాదచారులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. మునిసిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది అందరూ పనివేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వివిధ విభాగాలను తనిఖీ చేసిన కలెక్టర్, విధులు నిర్వహిస్తున్న అధికారులకు సంబంధించిన చార్టులను ప్రజలకు తెలిసేలా ఉంచాలని అన్నారు.ఈ పర్యటనలో పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్,జిల్లాపర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ రమాదేవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ నాగభూషణం, ఏపీఓ చినబాబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 5 views
    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    • By RAHEEM
    • October 29, 2025
    • 5 views
    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..