

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి-ఎస్సై
(మన న్యూస్ ప్రతినిధి) పత్తిపాడు : ప్రత్తిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయలో జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మి కాంతం 8,9,10 వ తరగతుల విద్యార్థిని విద్యార్థులకు డిజిటల్ అరెస్ట్,సైబర్ నేరాలు,ఆన్లైన్ మోసాలు,ఈవ్ టీజింగ్,రోడ్డు ప్రమాదాల నివారణ,దొంగతనాల నివారణ చర్యలు,చట్టాల మీద అవగాహన వంటి పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ ప్రతిభ విద్యాలయ అధినేత దాసం శేషారావు,ప్రధానోపాధ్యాయులు దాకే సత్యనారాయణ, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.