మధ్యాహ్న భోజన వర్కర్లకు అవగాహన సదస్సు

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్లకు శనివారం కొత్తగూడెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి యం. వెంకటేశ్వరాచారి అధ్యక్షతన ఆనందఖని యందు అవగాహన సదస్సు నిర్వహించడమైనది ఇట్టి అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మధ్యాహ్న భోజనం వంట చేసే గ్రూప్ సభ్యులు తప్పనిసరిగా సుచి, శుభ్రత, పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు వంట చేయుటకు ముందుగానే కాళ్లు చేతులు పరిశుభ్రంగా కడగాలని తలకు టోపీ ధరించి పరిశుభ్రమైన వాతావరణం లో మాత్రమే పాఠశాల ఆవరణలో మాత్రమే భోజనం వండాలని సూచించడం జరిగినది. పాఠశాలకు వచ్చిన బియ్యం ముందుగానే శుభ్రపరుచుకుని ఒక మంచి శుభ్రమైన డబ్బాలో పోసుకొని శుభ్రమైన నీటితో మాత్రమే వంట చేయాలని ఎటువంటి ఇబ్బందులు కలిగిన వెంటనే పై అధికారులకు తెలియజేయాలని సూచించడం జరిగినది. వంటకు ఉపయోగించే కూరగాయలు సాధారణంగా మునగాకు, కరివేపాకు, చింతాకు స్వయంగా పండించినదైతే చాలా మేలని పిల్లలకు బలాన్ని చేకూరుస్తాయని బయట షాప్ ల ద్వారా తీసుకువచ్చే కూరగాయలు శుభ్రమైన నీటితో కడగాలని అందులో పుచ్చులు పురుగులు పట్టినయ లేదా జాగ్రత్తగా చూసి వండాలని పిల్లలకేదైనా అనర్ధం జరిగినట్లయితే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆరోగ్యం బాగోలేని విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి భోజనం అందించాల్సిన అవసరం ఉంటేనే అందించాలని లేనియెడల ఉపాధ్యాయులకు విషయం తెలియపరిచి ఇంటికి పంపించేయాలని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి .వెంకటేశ్వర చారి,జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్, ఎఫ్ఏఓ శ్రీనివాస్ కొత్తగూడెం మండల విద్యాధికారి యం. ప్రభుదయాళ్ చుంచుపల్లి మండల విద్యాధికారి బి.బాలాజీ, లక్ష్మీదేవిపల్లి పి.కృష్ణయ్య కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం