కష్టానికి గౌరవం – పట్టుదలకి ప్రతిఫలం..పిట్లం పేపర్ బాయ్‌ నుంచి డాక్టరేట్ పట్టా..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లంకు చెందిన అబ్దుల్ మతీన్‌ పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించారు. చిన్నతనంలోనే తండ్రి అబ్దుల్ హమీద్‌ను కోల్పోయి, పినతండ్రి అబ్దుల్ మజీద్‌, అన్నయ్య అబ్దుల్ మాలిక్ పర్యవేక్షణలో పెరిగారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ, చదువును మాత్రం ఎప్పుడూ వదల్లేదు.పిట్లం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే పేపర్ బాయ్‌గా పనిచేసి, జీవనాధారాన్ని సమకూర్చుకున్నారు. తరువాత హైదరాబాద్‌కు వెళ్లి ఉస్మానియా యూనివర్సిటీలో MBA, M.Com డిగ్రీలు పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక ప్రఖ్యాత డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.ఇటీవల “రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ప్రవర్తనా అంశాల ప్రభావాన్ని అన్వేషించడం – హైదరాబాద్ పెట్టుబడిదారులపై ఒక అధ్యయనం” అనే అంశంపై పరిశోధన చేసి Ph.D. పట్టా అందుకున్నారు.ఈ పరిశోధన సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఉషా కిరణ్‌ మార్గదర్శకత్వంలో పూర్తయింది.తన విజయంపై అబ్దుల్ మతీన్ మాట్లాడుతూ.. తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు. పేదరికం ఉన్నా కష్టపడితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చుఅని తెలిపారు. మతీన్‌ పట్టుదల, కృషి, పట్టింపు అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.అబ్దుల్ మతీన్ డాక్టరేట్‌ సాధనపై కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.

  • Related Posts

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    అనంతపురం,సెప్టెంబర్ 10 : (మనద్యాస న్యూస్) ప్రతినిధి : నాగరాజు ://///// రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో అనంతపురంలో బుధవారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్