

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీ, స్వాతి ప్రసాద్ ఆదేశాల మేరకు ఏలేశ్వరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ చౌక్ సెంటర్ నుండి ప్రధాన రహదారి మీదుగా తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఇంచార్జ్ తహసీల్థార్ పొన్నాలుకు వినతిపత్రం అందజేశారు.మంగళవారం జర్నలిస్టుల డిమాండ్స్ని పురస్కరించుకుని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు స్వర్ణ పూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు జారీ చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు.అక్రిడేషన్లు లేకపోవడంతో జర్నలిస్టులు పలు సదుపాయాలు పొందలేకపోతున్నారని చెప్పారు. పాత అక్రిడేషన్ల గడువును పలుమార్లు పొడిగిస్తూ కొత్త అక్రిడేషన్లు జారీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు.దీనితో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ లేకపోవడమే కాకుండా వారికి ఆరోగ్య బీమా,ఇతర సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న జర్నలిస్టులకు ఇప్పటికీ కొత్త అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు.ఇప్పటికే మూడు విడతలుగా అక్రిడేషన్ల గడువు పొడిగించుకుంటూ వచ్చినట్లు వివరించారు.ఆగస్టు 31తో మరోసారి గడువు ముగిస్తుందని తెలిపారు. జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం, పక్కా గహ నిర్మాణం,ఆరోగ్య భీమా తదితర సౌకర్యాలు కల్పించాలని జర్నలిస్టులు కోరారు.ఈ కార్యక్రమంలో కుంపట్ల ప్రసాద్,శలా మల్లికార్జునరావు,మువ్వల శ్రీను, పారేపల్లి గంగా ప్రసాద్,దాసరి కృష్ణ, గొల్లపల్లి రాజబాబు,పోతుల లావరాజు,ఆకుల శివాజీ,రాచర్ల రమేష్,శిడగం మాధవ తదితరులు పాల్గొన్నారు.