ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. మంత్రి దామోదర రాజనర్సింహ

మన న్యూస్, హైదరాబాద్,జోగిపేట్, జులై17,
వానాకాలం, రబ్బీ సీజన్లో రైతులు పంటలు సాగు చేసేందుకు అవసరమయ్యే సాగు నీటిని ప్రతి ఎకరాకు అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పుల్కల్ మండల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టు వద్ద ఉన్న సింగూరు ఎడమ కాలువ కాల్వ నుంచి గురువారం మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి సాగునీటికి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగూర్ ప్రాజెక్టు నుంచి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. రైతులు సింగూరు నీటిని వినియోగించుకొని పంటలు సాగు చేసుకోవాలని ఆయన తెలిపారు. సింగూరు నీటి విడుదలలో రాజకీయాల జోక్యం వద్దు అని, రైతు సంక్షేమానికి ప్రజా పాలన ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాల్వల ద్వారా అందోల్, పుల్కల్,
చౌటాకూర్ మండలాల పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను నింపి, ఆపై క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సింగూరు కాలవల మరమ్మతులు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. రైతులందరూ దీనికి సహకరించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో రాజనర్సింహ ఫౌండేషన్ చైర్మన్ త్రిష దామోదర, పుల్కల్ మండల పార్టీ అధ్యక్షులు దుర్గారెడ్డి, జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ మక్త జగన్ మోహన్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ భీమ్, అందోల్ ఆర్డీవో ఆర్. పాండు, సింగూరు డిప్యూటీ ఈఈ నాగరాజ్, అందోల్ డిప్యూటీ ఈఈ విక్రమ్, ఏ డబ్ల్యు మజార్, మైపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సురేందర్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల ప్రవీణ్ కుమార్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..