

మన న్యూస్, సాలూరు జూలై 11:- సాలూరులో సిపిఎం సమావేశం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు, మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో డోలీలా మోత లేకుండా అన్ని గ్రామాలకి సదుపాయాలు కల్పించాలి కోటియా సరిహద్దు గ్రామాల సమస్యను పరిష్కారం చేయాలి అన్సర్వేడు అటవీ బంజరు భూములకు పట్టాలి ఇవ్వాలి నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ గ్రామాల జాబితాలో చేర్చి ప్రకటించాలని డిమాండ్ చేశారు, రాష్ట్రంలో డోలీలు మోత లేకుండా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రయత్నం చేశారని ప్రకటనలకే పరిమితం అయ్యారు తప్ప సమస్య పరిష్కారం కోసం ఎక్కడా చొరవ చూపలేదని తెలిపారు,సాలూరు మండలంలో ఇటీవల కాలంలో కురుకుటి పంచాయతీ ఎగువ కాసాయవలస గ్రామానికి చెందిన కోనేటి సామలమ్మ అనే ఆశా వర్కకు ఆరోగ్యం బాగోలేక డోలి కట్టి సుమారు 5 కిలోమీటర్లు కాలిబాటన తీసుకువస్తే బాధ్యత గల స్థానంలో ఉండి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు బాధ్యతరాహిత్యంగా హేళనగా మాట్లాడటం సరికాదని తెలిపారు కనీసం సదుపాయాలు రోడ్లు లేకుండా రోగులను డోలీలుతో తప్ప మరి ఏ విధంగా తీసుకురావాలో మంత్రిగారి చెప్పాలని కోరారు ఇప్పటికైనా గిరిజన గ్రామాలకు మౌలు సదుపాయాలు కల్పనలో దృష్టి పెట్టాలని కోరారు మండలంలో అటవీ అన్సర్వేడు బంజరు భూములను తరతరాలుగా గిరిజనులు పేదలు సాగు చేసుకుంటున్న నేటికి పట్టాలు ఇవ్వడం లేదని తెలిపారుచేయడం లేదని తెలిపారు కొట్టియా సరిహద్దు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు ఒడిస్సా ప్రభుత్వం గిరిజనుల పైన దాడులకు దౌర్జన్యాలు చేస్తుంటే అడ్డుకోవలసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌనంగా ఉండడం సరికాదని శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన స్టాటిస్కో ను అమలు చేయాలని గిరిజనులకు రక్షణ కల్పించాలని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రక్షణగా అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం సరికాదని తెలిపారు,మండలంలో ఎక్కువ భాగం నాన్ షెడ్యూల్ గ్రామాలుగా ఉన్నాయని వాటిని షెడ్యూల్ గ్రామాలుగా గుర్తించి డిమాండ్ చేశారు. ఆలూరు పట్టణంలో ఏరియా హాస్పిటల్ గా నిర్మాణం అవుతున్న భవనాలను వెంటనే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొని రావాలని డిమాండ్ చేశారు, లేనియెడల గిరిజనులను పేదలను సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు ,కమిటీ సభ్యులు శ్రీధరపు అప్పారావు, గేమ్మెల బాబయ్య ,వంతల సుందర్రావు ,తదితరులు పాల్గొన్నారు.