విద్యార్థులకు పలకలు పంపిణీ…సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లతా…రూరల్ మండలాధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి…

మన న్యూస్,తిరుపతి రూరల్ :- విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలని తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు మూలం చంద్రమోహన్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ అగ్రహారంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన పేరెంట్స్ సమావేశానికి రూరల్ మండలాధ్యక్షుడు మూలం చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్పంచ్ చెరకుల జనార్దన్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుంచే గురువులు తల్లిదండ్రుల మాటలు శ్రద్ధగా విని ఉన్నత చదువులు చదివి లక్ష్యానికి చేరుకోవాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, విద్యార్థులు చిన్నప్పటినుంచి క్రీడల పట్ల దృష్టి సారించేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని కోరారు. చదువుతోపాటు క్రీడలను అలవర్చుకోవడం వల్ల విద్యార్థులలో ఏకాగ్రత మానసిక ప్రశాంతత అలబడుతుందని చెప్పారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు మూలం చంద్రమోహన్ రెడ్డి పలకలు, నోటి పుస్తకాలు పంపిణీ చేశారు. సమస్యల వలయములో ప్రభుత్వ పాఠశాల… అగ్రహారంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ సందర్భంగా పాఠశాలల్లోని పలు సమస్యలను విద్యార్థుల తల్లిదండ్రులు మండల అధ్యక్షుడు మూలం చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులకు కావలసినన్ని తరగతుల లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రెండు ఆదనపు గదులు కావాలని కోరారు. మరుగుదొడ్లు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఈ విషయాన్ని గతంలో పలుమార్లు మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి సర్పంచ్ నేతృత్వంలో తీసుకెళ్లిన ప్రయోజనం లేదన్నారు. ప్రాథమిక పాఠశాల రోజురోజుకు శిథిలం అవుతోందని వెంటనే మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు స్పందించిన మండల అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి వెంటనే సమస్యలు అన్నింటిని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చొరవ చూపుతామన్నారు. ఈ సమావేశంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ చైర్మన్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Posts

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

వరికుంటపాడు,,మనన్యూస్: గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మండల కేంద్రంలోని వరికుంటపాడు గ్రామంలో శ్రీ సాయిబాబా మందిరంలో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని, కరుణా కటాక్షాలు కలగాలని, వేగంగా పనులు జరగాలని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.…

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

కలిగిరి, మన న్యూస్ : పిల్లల బంగారు భవిష్యత్తు కోసం. బడివైపు ఒక అడుగు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి శ్రీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

గురువే దైవం: ఉరవకొండలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు

గురువే దైవం: ఉరవకొండలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు

రెల్లివలసలో అగ్రిఫీల్డ్స్ ఉచిత ఆరోగ్య శిబిరం మరియు పాఠశాల క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది

రెల్లివలసలో అగ్రిఫీల్డ్స్ ఉచిత ఆరోగ్య శిబిరం మరియు పాఠశాల క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది

పేరెంట్స్ డే సందర్భంగా బింగినపల్లిలో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు

పేరెంట్స్ డే సందర్భంగా బింగినపల్లిలో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు