ఎస్.ఆర్.పురం మండలంలో “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం

ఎస్.ఆర్.పురం,మన న్యూస్ , జూలై 10:– ఎస్.ఆర్.పురం మండలంలోని కటికపల్లి పంచాయతీలో “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం బుధవారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమల్ల ప్రసాద్ రావు , గంగాధర నెల్లూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం. థామస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటిని స్వయంగా సందర్శించి, ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంలో అమలు చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేశారు. ముఖ్యంగా పింఛన్లు, రైతు భరోసా,తల్లికి వందనం మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాల గురించి వివరించారు. ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు పాటుపడుతున్న విధానాలపై రూపొందించిన కరపత్రాలను ప్రతీ ఇంటికి పంపిణీ చేయడం జరిగింది. ప్రజలతో మమేకమవుతూ నాయకులు వారి సమస్యలను, అభిప్రాయాలను నేరుగా స్వీకరించడం జరిగింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రభుత్వ కార్యకలాపాలపై సానుకూల స్పందన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికార యంత్రాంగం సభ్యులు మరియు గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు. “సుపరిపాలన తొలి అడుగు” అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండే పాలనకు మార్గం సుగమం చేస్తున్నామన్న సందేశాన్ని నాయకులు పునరుద్ఘాటించారు. అధికారవర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ కార్యక్రమం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నిర్వహించబడతుంది. ప్రజల అభ్యున్నతికే తమ అంకిత భావంతో పనిచేస్తున్నామని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేయడమే తమ లక్ష్యమని ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు తెలుగు యువత అధ్యక్షులు కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 4 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 8 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//