

గూడూరు, మన న్యూస్. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు పురుషులతోపాటు మహిళల ముందు ఉండాలని దృఢ సంకల్పంతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే నని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. బుధవారం గూడూరు మునిసిపాలిటీ మెప్మా లో పనిచేస్తున్న 77 మంది రిసోర్స్ పర్సన్లకు గూడూరు శాసన సభ్యులు డా: పాశిం సునీల్ కుమార్ చేతులు మీదుగా రూ : 32,999/- ల విలువ గల ట్యాబ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం రిసోర్స్ పర్సన్లు చే లచే పనులు చేయించుకొని ప్రతి 3 సంవత్సరాలకు ఆర్పీలను లను మార్పు చేసేవారని అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం ఆర్పీల సమస్యలను గుర్తించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలనే సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీరు పని చేసినన్ని రోజులు మీకు అవకాశం కల్పించేలా చేశారన్నారు. అదేవిధంగా ఆర్పీలు పని ఒత్తిడికి గురి అవుతున్నారనే ఉద్దేశ్యం తో కంప్యూటర్ లతో సమానమైన,నాణ్యమైన 32999/- రూపాయలు విలువచేసే ట్యాబ్ లను బహుమతిగా అందించారని, గతంలో కూడా మీకు ట్యాబ్ లను అందించిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రతి ఆర్ పి ప్రభుత్వ పథకాలను ప్రతి లబ్ధిదారునికి అందేలా చేయాలని పిలుపు నిచ్చారు .గూడూరు కమీషనర్ ఏ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్పీలు అందరూ ఇక ప్రతి ఆన్లైన్ వర్క్స్ వేగవంతం చేసి రాష్ట్రంలోనే గూడూరు మునిసిపాలిటీ ని అన్ని కార్యక్రమాలలో ముందుంచి మన ఎమ్మెల్యేకు,ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, నాయకులు దశరథ రామిరెడ్డి, అమరేంద్ర, జనసేన నాయకులు చంద్ర నీల్,మెప్మా సిటీ మిషన్ మేనేజర్ పెంచలయ్య కమ్యూనిటీ ఆర్గనైజర్ చందన ,డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉషా పట్టణ సమాఖ్య అధ్యక్షులు సులోచనమ్మ, టిఎల్ఎఫ్ ఆర్ పి లు లు లక్ష్మి, సుజాత, రిసార్స్ పర్సన్స లు పాల్గొన్నారు.
