అన్నిదానాలు కన్నా రక్త దానం మిన్న – మాతృభూమి సేవాసంఘం కార్యదర్శి గోపాలరావు

మన న్యూస్ పాచిపెంట, జూలై 2:- అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని విజయనగరం మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి ఇప్పలవలస గోపాలరావు పేర్కొన్నారు. బుధవారం నాడు మండల కేంద్రమైన పాచిపెంట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం మాతృభూమి సేవ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మాతృభూమి సేవ సంఘం కార్యదర్శి ఇప్పలవలస గోపాలరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎన్విఎన్ విజయనగరం బ్లడ్ బ్యాంక్ వాళ్ళు పాల్గొని దాతలు నుండి రక్త సేకరణ చేసారు. ఈ సందర్భంగా కార్యదర్శి గోపాలరావు మాట్లాడుతూ సికిల్ సీనిమియా, రక్త హీనత కలిగిన గర్భిణీలకు ఈ రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. 18 ఏళ్ళు నిండిన వారు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్త దానం చేయాలని కోరారు మీరు ఇచ్చే రక్తంతో ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు అని తెలియజేశారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాచిపెంట తాసిల్దార్ డి.రవి సూచించారు. రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదాతలుగా నిలుస్తామని కళాశాల ప్రిన్సిపల్ కట్టా జాన్సీ తెలిపారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్యంకి గురికామని ఎలాంటి అపోహలు పోవద్దని సంస్థ సభ్యులు కటారి ఈశ్వరరావు సూచించారు. ఈ కార్యక్రమంలో 40 మంది దాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని సంస్థ సభ్యులు వివరించారు. కార్యక్రమం అనంతరం కళాశాల విద్యార్థులకు రక్తదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..